యాప్నగరం

మంత్రి భూకొనుగోలుపై ఆధారాలు బయటపెడ్తా

అగ్రిగోల్డ్ భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని వాటి మీడియా

Samayam Telugu 24 Mar 2017, 4:22 pm
అగ్రిగోల్డ్ భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని వాటి మీడియా సమక్షంలో బయటపెడతానని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఏపీ అసెంబ్లీలో అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంపై వాడివేడి చర్చ జరిగింది.
Samayam Telugu ys jagan says he has all proofs of ministers agrigold land dealings
మంత్రి భూకొనుగోలుపై ఆధారాలు బయటపెడ్తా


సభలో తమకు మాట్లాడే అవకాశం కల్పించకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో నిజానిజాలు బయటకు రాకుండా అధికారపక్షం అడ్డుకుంటోందని జగన్ విమర్శించారు. తాను ప్రత్తిపాటి పుల్లారావుపై చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు (భూకొనుగోలు) సేకరిస్తున్నానని చెప్పారు. ఆధారాలు సభలో వెల్లడించాక తప్పెవరిదో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు.

వైసీపీ గుర్తుపై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారిపై ఇంతవరకు ఏ చర్య తీసుకోలేని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.