యాప్నగరం

జగన్ జెరూసలేం పర్యటన.. సీఎం భద్రత కోసం రూ.22 లక్షలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా నాలుగు రోజుల జెరూసలేం పర్యటనకు వెళ్తున్నారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. కానీ సీఎం భద్రతా ఏర్పాట్ల కోసం ఏపీ సర్కారు రూ.22.52 లక్షలు కేటాయించింది.

Samayam Telugu 20 Nov 2019, 12:33 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (ఆగష్టు 1న) జెరూసలేం బయలుదేరి వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా ఆయన జెరూసలేం వెళ్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ లోటస్ పాండ్ సమీపంలోని నివాసానికి జగన్, ఇతర కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని ముంబై వెళ్తారు. అక్కడి నుంచి విమానంలో నేరుగా జెరుసలేం వెళ్తారు. ఆగష్టు 4 వరకు జగన్ అక్కడే ఉండనున్నారు. ఈ నెల 5న ముంబై మీదుగా విజయవాడ వస్తారు. సీఎం పర్యటన పూర్తి వ్యక్తిగతమని అధికార వర్గాలు తెలిపాయి.
Samayam Telugu jagan at collectors meeting


See Photo Story: కోటి దీపోత్సవంలో మెరిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
సీఎం జెరూసలేం పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్ల కోసం ఏపీ ప్రభుత్వం రూ.22 లక్షల 52 వేలను విడుదల చేసింది. ఇజ్రాయెల్‌లో సీఎం భద్రతా ఏర్పాట్ల కోసం ట్రిపుల్ ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు 30591 డాలర్లను చెల్లించున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించడం కోసం హైదరాబాద్‌లోని ట్రావెల్ ఏజెంట్ ‘ఎయిర్ ట్రావెల్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్‌’కు రూ.22,52,500 చెల్లిస్తోంది. సీఎం పర్యటన వ్యక్తిగతమైనప్పటికీ.. ఆయన భద్రత కోసం ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.