వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన అధికారం చేపట్టాలని ఊవ్విళ్లూరుతోన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని వర్గాలనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో ఎంతో కీలకమైన బీసీలను ప్రసన్నం చేసుకోడానికి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా బీసీ గర్జన పేరిట ఓ భారీ బహిరంగ సభను ఆదివారం వైసీపీ నిర్వహిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వట్లూరు గ్రామ పరిధిలోని ఓ లేఅవుట్కు చెందిన 25 ఎకరాల స్థలంలో సభ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సభ ప్రారంభం కానుంది. వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, జంగా కృష్ణమూర్తి, ఆళ్ల నాని తదితరులు శనివారం సాయంత్రం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సభ ఉద్దేశం, జగన్ ఏం ప్రకటించబోతున్నారనేది సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు భరోసా కల్పించే ఉద్దేశంతో బీసీ గర్జన నిర్వహిస్తున్నామని పార్థసారథి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తీసుకోబోయే చర్యలు, పథకాల గురించి ఈ వేదికపై జగన్ ప్రకటిస్తారని తెలిపారు. బీసీల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసే జగన్కు అండగా నిలవడానికి ఆయా వర్గాలు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ బీసీ అధ్యయన కమిటీ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఈ సభలో తమ అధినేత ప్రకటించే డిక్లరేషన్తో బీసీల భవిష్యత్తు మారబోతుందని అన్నారు.
బలహీన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తగిన విధానాలను జగన్ ప్రకటిస్తారని, ఇవి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేలా ఉంటాయని తెలియజేశారు. కాగా, పరిశ్రమల స్థాపన కోసం ఎస్సీ, ఎస్టీలకు ఏపీఐఐసీలో భూములు కేటాయిస్తున్న విధంగానే బీసీలకు కూడా ప్రోత్సహకాలు ఇవ్వడం, కులాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటు లాంటి అంశాలపై జగన్ హామీలు ప్రకటించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అలాగే, ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బలహీన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తగిన విధానాలను జగన్ ప్రకటిస్తారని, ఇవి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేలా ఉంటాయని తెలియజేశారు. కాగా, పరిశ్రమల స్థాపన కోసం ఎస్సీ, ఎస్టీలకు ఏపీఐఐసీలో భూములు కేటాయిస్తున్న విధంగానే బీసీలకు కూడా ప్రోత్సహకాలు ఇవ్వడం, కులాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటు లాంటి అంశాలపై జగన్ హామీలు ప్రకటించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అలాగే, ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.