యాప్నగరం

‘అగ్రిగోల్డ్’ నుంచి జగన్‌కు ముడుపులు: మంత్రి

ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘అగ్రిగోల్డ్’ యజమానుల

Samayam Telugu 24 Mar 2017, 9:10 pm
ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘అగ్రిగోల్డ్’ యజమానుల నుంచి గత ఎన్నికల సమయంలో జగన్ డబ్బులు తీసుకున్నారని పుల్లారావు ఆరోపించారు. శుక్రవారం ‘అగ్రిగోల్డ్’ భూములపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ భూములను ప్రత్తిపాటి కొనుగోలు చేశారని, ఇదో పెద్ద కుంభకోణమని జగన్ ఆరోపించారు.
Samayam Telugu ys jagan took money from agri gold minister prathipati
‘అగ్రిగోల్డ్’ నుంచి జగన్‌కు ముడుపులు: మంత్రి


జగన్ ఆరోపణలపై ప్రతిపాటి పుల్లారావు సాయంత్రం విజయవాడలో మీడియా సమావేశంలో స్పందించారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో అగ్రిగోల్డ్ యజమానుల నుంచి జగన్ డబ్బులు తీసుకున్నారని, ఈ కుంభకోణంలో ఆయన హస్తం ఉందని ఆరోపించారు.

ఉదయ్ దినకరన్ అనే వ్యక్తి దగ్గర తాను ఆరెకరాల 19 సెంట్ల భూమి కొనుగోలు చేశానని..అయితే అవి అగ్రిగోల్డ్ భూములు కావని పుల్లారావు స్పష్టం చేశారు. దినకరన్ అగ్రిగోల్డ్ సంస్థలో ప్రమోటర్ కాదని కేవలం ప్రొఫెషనల్ డైరెక్టర్ మాత్రమేనని..ఆయన భార్య ఓ పాఠశాలలో ఉద్యోగిని అని పుల్లారావు వివరించారు. దినకరన్ వేరే వ్యక్తుల దగ్గర కొన్న భూమిని తనకు అమ్మాడని, ఇందులో ఏలాంటి దాపరికం లేదని అన్నారు.
మరో ముగ్గురు రైతుల వద్ద తాను 14 ఎకరాల భూమి కొనుగోలు చేశానని..ఆ రైతులకు అగ్రిగోల్డ్ తో ఏలాంటి సంబంధం లేదని పుల్లారావు అన్నారు.

అవాస్తవాలతో తనను, తన కుటుంబాన్ని జగన్ బజారుకీడుస్తున్నారని పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయలేక జగన్ సభ నుంచి పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.