యాప్నగరం

‘బాబు పాలన ఒక విధ్వంసం’

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి నాలుగేళ్ల పాలన ఒక విధ్వంసం అని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత

Samayam Telugu 9 Jun 2018, 8:40 am
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి నాలుగేళ్ల పాలన ఒక విధ్వంసం అని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లను పూర్తి చేసుకున్న తరుణంలో జగన్ ఒక ట్వీట్ పెట్టారు. బాబు పాలనను విమర్శిస్తూ, ఆయన పాలనలో ఏయే వర్గాలు అన్యాయం అయిపోయాయో పేర్కొంటూ జగన్ ట్వీట్ చేశారు.
Samayam Telugu ysjagan.


‘ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా విషయంలో ద్రోహం జరిగింది. యువతకు ఉద్యోగాలు లేవు. రైతు రుణాలను, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయలేదు, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేశారు, అవినీతి పెరిగింది. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారు, బాబు కేవలం గొప్పలు చెప్పుకొంటున్నారు, ఇలా నాలుగేళ్ల చంద్రబాబు పాలన ఒక విధ్వంసంలా సాగింది, రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు..’ అని జగన్ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.