యాప్నగరం

ఏపీ స్పీకర్ కోడెలకు జగన్ బహిరంగ లేఖ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుకు బహిరంగ లేఖ

Samayam Telugu 27 Feb 2017, 2:45 pm
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుకు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ గుర్తుపై గెలిచిన టీడీపీలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని ఆయన లేఖలో కోరారు.
Samayam Telugu ys jagan writes to ap speaker kodela
ఏపీ స్పీకర్ కోడెలకు జగన్ బహిరంగ లేఖ


తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సీఎం అడ్డంగా దొరికిపోవడం వల్లే హడావుడిగా అసెంబ్లీని అమరావతికి మార్చుతున్నారని జగన్ ఆరోపించారు. 21 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తాను ఏనాడో కోరానని..స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోవడం లేదని జగన్ గుర్తు చేశారు.

జగన్ రాసిన లేఖను..వైసీపీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వర్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ లు హైదరాబాద్ పార్టీలో ఆఫీసులో మీడియాకు చూపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.