యాప్నగరం

శ్రీకాకుళంలో జగన్ రెండు రోజుల పర్యటన

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి రెండు రోజులపాటు...

Samayam Telugu 19 May 2017, 12:07 am
ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి రెండు రోజులపాటు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని హిరామండలంలో జరిగే మొదటి రోజు(మే19వ తేదీ) పర్యటనలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకి జిల్లాలోని రణస్థలం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసిరెడ్డి వరదరామారావు వైఎస్సార్‌సీపీ చేరనున్నారు.
Samayam Telugu ys jaganmohan reddy to tour srikakulam dist on 19th and 20th may
శ్రీకాకుళంలో జగన్ రెండు రోజుల పర్యటన


ఇక రెండో రోజైన 20వ తేదీన ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించి జగతి గ్రామం హనుమాన్ జంక్షన్‌లో కిడ్నీ సమస్యల బాధితులతో భేటీ అయి వారి సమస్యలపై చర్చించనున్నారు జగన్. ఈమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.