యాప్నగరం

YS Jagan: తూర్పుగోదావరిలోకి జగన్ పాదయాత్ర.. జనసంద్రమైన రాజమండ్రి

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. పశ్చిమగోదావరి జిల్లాలో యాత్రను ముగించుకొని.. కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి మీదుగా జిల్లాలోకి ప్రవేశించారు.

Samayam Telugu 12 Jun 2018, 6:22 pm
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. పశ్చిమగోదావరి జిల్లాలో యాత్రను ముగించుకొని.. కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి మీదుగా జిల్లాలోకి ప్రవేశించారు. ప్రతిపక్ష నేతకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జననేత తమ జిల్లాలోకి వస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రమైంది.
Samayam Telugu Jagan


వేలాదిగా తరలివచ్చిన జనవాహిని మధ్య జగన్‌ అభివాదం చేస్తూ అడుగులు వేశారు. తమ అభిమాన నేత వైఎస్‌ జగన్‌ను చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలిరావడంతో రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి వద్ద పండగ వాతావరణం కనిపించింది. బ్రిడ్జి నుంచి పాదయాత్ర కొనసాగించిన వైఎస్‌ జగన్‌ శ్యామల థియేటర్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు.

జగన్‌కు అడుగడునా ఘన స్వాగతం లభించింది . రోడ్‌ కం రైల్వే బ్రిడ్జిని పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో ఏర్పాటు చేశారు. బ్రిడ్జికి మరోవైపున రెయిలింగ్‌కు ఏడు అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల మేర భారీ పార్టీ జెండాను కట్టారు. బ్రిడ్జి కింద గోదావరిలో పార్టీ జెండాలతో అలంకరించిన 600 పడవలు స్వాగతం పలికారు. జెండాలోని మూడు రంగుల చీరలతో 150 మంది మహిళలు 150 గుమ్మడికాయలతో హారతి ఇచ్చారు.
Photos: రాజమండ్రి వంతెనపై జగన్ పాదయాత్ర

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.