వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, జగన్ బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతిచెందినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. గుండెపోటుతో బాత్రూమ్లో మృతిచెంది ఉండగా ఆయనను కుటుంబసభ్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి బాత్రూమ్కు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. పులివెందులలోని తన స్వగృహంలోనే కన్నుమూశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. వివేకాకు భార్య సౌభాగ్య, కుమార్తె సునీత ఉన్నారు. 1950 ఆగస్టు 8న జన్మించిన వైఎస్ వివేకానందరెడ్డి 1989, 1994లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఐదారు రోజులుగా వైసీపీ అభ్యర్థుల ఎంపికలో జగన్కు తోడుగా ఉన్న వివేకా, గురువారం రాత్రే పులివెందులకు వచ్చారు. వచ్చేసరికి అర్ధరాత్రి కావడం, బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున వాంతులు మొదలుకావవడంతో బాత్రూమ్లోకి వెళ్లి అక్కడే కుప్పకూలారు. ఆ సమయంలో ఇంట్లో వివేకానందరెడ్డి ఒక్కరే ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్నానాల గదిలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్తో విభేదించిన ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వేరుకుంపటి పెట్టుకున్నా వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్లో కొనసాగారు. కిరణ్కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాలు కడప నుంచి ఎంపీగా విజయం సాధించారు. వైఎస్ ఆ సీటు నుంచి తప్పుకున్నాక వివేకానందరెడ్డికి అవకాశం వచ్చింది. ఒక దశలో కాంగ్రెస్ హైకమాండ్ వివేకానందరెడ్డిని జగన్ కు వ్యతిరేకంగా ఉసిగొల్పింది. అయితే తర్వాత మారిన పరిణామాలతో వైసీపీలోకి చేరి జగన్కు అండగా ఉన్నారు.
వైఎస్ వివేకా హఠాన్మరణంతో వైసీపీ నేతలు, శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ సీటుకు వైఎస్ వివేకా పేరు పరిశీలనలో ఉండగా అంతలోనే ఆయన కన్నుమూశారు. 1999,2004 లలో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. జగన్ కోసం 2009 ఎన్నికల్లో కడప ఎంపీ సీటును వదులుకున్నారు. చాలా సౌమ్యుడిగా పేరుపొందిన వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్సార్ అభిమానుల్లో విషాదఛాయలు నింపింది.
లయిన్స్ క్లబ్ తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ వివేకా చురుకుగా పాల్గొన్నారు. లింగాల కాల్వకు డిజైన్ రూపకల్పన చేసింది కూడా ఆయనే. వైఎస్ వివేకానందరెడ్డి మరణం వైసీపీకే కాదు, కడప జిల్లాకు కూడా తీరనిలోటని అన్ని రాజకీయ పార్టీలూ పేర్కొన్నాయి. సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సాధారణ వ్యక్తిలా చిన్న చిన్న పనుల కోసం కూడా ఆయనే స్వయంగా ఆఫీసులకు వెళ్లేవారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్తో విభేదించిన ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వేరుకుంపటి పెట్టుకున్నా వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్లో కొనసాగారు. కిరణ్కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాలు కడప నుంచి ఎంపీగా విజయం సాధించారు. వైఎస్ ఆ సీటు నుంచి తప్పుకున్నాక వివేకానందరెడ్డికి అవకాశం వచ్చింది. ఒక దశలో కాంగ్రెస్ హైకమాండ్ వివేకానందరెడ్డిని జగన్ కు వ్యతిరేకంగా ఉసిగొల్పింది. అయితే తర్వాత మారిన పరిణామాలతో వైసీపీలోకి చేరి జగన్కు అండగా ఉన్నారు.
వైఎస్ వివేకా హఠాన్మరణంతో వైసీపీ నేతలు, శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ సీటుకు వైఎస్ వివేకా పేరు పరిశీలనలో ఉండగా అంతలోనే ఆయన కన్నుమూశారు. 1999,2004 లలో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. జగన్ కోసం 2009 ఎన్నికల్లో కడప ఎంపీ సీటును వదులుకున్నారు. చాలా సౌమ్యుడిగా పేరుపొందిన వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్సార్ అభిమానుల్లో విషాదఛాయలు నింపింది.
లయిన్స్ క్లబ్ తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ వివేకా చురుకుగా పాల్గొన్నారు. లింగాల కాల్వకు డిజైన్ రూపకల్పన చేసింది కూడా ఆయనే. వైఎస్ వివేకానందరెడ్డి మరణం వైసీపీకే కాదు, కడప జిల్లాకు కూడా తీరనిలోటని అన్ని రాజకీయ పార్టీలూ పేర్కొన్నాయి. సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సాధారణ వ్యక్తిలా చిన్న చిన్న పనుల కోసం కూడా ఆయనే స్వయంగా ఆఫీసులకు వెళ్లేవారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.