యాప్నగరం

ప్రజాభిమానమే జగన్‌ను కాపాడింది: విజయమ్మ

విచారణ అవసరం లేదని చంద్రబాబు ఏ విదంగా మాట్లాడుతున్నాడు? సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?' అని విజయమ్మ ప్రశ్నించారు.

Samayam Telugu 11 Nov 2018, 11:56 am
విశాఖ విమానాశ్రయంలో గత నెల 25న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇంతవరకు వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులెవరూ మీడియాతో మాట్లాడలేదు. కాగా ఈ ఘటనపై తొలిసారిగా వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు, వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మ ఆదివారం (నవంబరు 11) లోటస్‌ పాండ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'గొంతులో దిగాల్సిన కత్తి భుజానికి తగిలిందని.. ప్రజాభిమానమే జగన్‌ను కాపాడింది' అని అన్నారు. జగన్‌కి ఇది పునర్జన్మ అని చెప్పిన ఆమె.. 'భర్తను కోల్పోయిన నేను.. కొడుకును పోగోట్టుకోవడానికి సిద్ధంగా లేను. దయ చేసి ‌నా కోడుక్కి ఎలంటి హానీ కల్పించకండి' అని విజ్ఞప్తి చేశారు.
Samayam Telugu విజయమ్మ


ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ను అంతం చేసేందుకు రెక్కీ నిర్వహించారని తమకు సమాచారం ఉందని ఆమె తల్లి విజయమ్మ చెప్పారు. జగన్‌ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించారని.. వారందరికీ కృతజ్ఞతలని చెప్పారు. జగన్‌కు ప్రభుత్వం భద్రత కల్పించకపోయినా ప్రజలే కాపాడుకుంటున్నారని ఆమె అన్నారు. జనం నుంచి జగన్‌ను విడదీయలేరని ఆమె అన్నారు. జైల్లో వున్న పదహారు నెలలు తప్ప మిగిలినన్ని రోజులూ జగన్‌.. జనం మధ్యే ఉన్నారన్న విజయమ్మ.. జనం‌ లేని చోట జగన్ పై దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

చిన్న గాయమే.. విచారణ అక్కర్లేదని ఎలా చెబుతారు? హత్యాయత్నం తర్వా, కత్తి చిన్నదేగా.. గాయం ఎంత వెడల్పు ఉంది? లోతెంత? అంటూ విచారణను పక్కదారి పట్టిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. క్యాంటీన్‌ ఓనర్‌ను ‌కూడా విచారణ చేయకుండా తూతూ మంత్రంగా మాట్లాడి వదిలేశారు. విచారణ అవసరం లేదని చంద్రబాబు ఏ విదంగా మాట్లాడుతున్నాడు? సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?' అని ప్రశ్నించారు.

ఎయిర్ పోర్టులో, వీఐపీ లాంజ్‌లో భద్రత లేకపోతే ఇంకెక్కడ భద్రత ఉంటుంది? ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ లేకపోతే.. ఈ ప్రభుత్వం ఇంకెవరికి సెక్యూరిటీ ఇస్తుంది? ఎయిర్ పోర్టులోకి గుండుసూది కూడా పోలేదు. నెయిల్ కట్టర్లు, చిన్న కత్తెరలు ఉన్నా తీసేస్తారు. అలాంటిది ఏ విధంగా కత్తి వెళ్లింది. ఎవరు సహాయం చేశారు?. ఎవరి ప్రోద్బలంతో కత్తి వెళ్లింది? దాని గురించి విచారణ లేనేలేదు అని విజయమ్మ అన్నారు. దాడి కేసులో విచారణ తూతూమంత్రంగా సాగుతోందన్న విజయమ్మ.. పరిటాల హత్య జరిగినప్పుడు సీబీఐ విచారణకు వైఎస్‌ ఆదేశించారని గుర్తుచేశారు. తమ కుటుంబ సభ్యుల్లో మహిళలను కూడా తిడుతున్నారని..నిరాధార ఆరోపణలను మౌనంగా భరిస్తున్నామని విజయమ్మ చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి తెచ్చారు. కానీ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ కష్టాలపాలు చేసింది' అని విజయమ్మ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.