యాప్నగరం

మోదీ సర్కార్‌కు వైసీపీ ఝలక్.. ట్రిపుల్ తలాక్ బిల్లుకు నో

కేంద్రానికి ఝలక్ ఇచ్చిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్‌లో ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకించిన సభ్యులు. మొన్న లోక్‌సభ.. ఇవాళ రాజ్యసభలోనూ అదే పరిస్థితి.

Samayam Telugu 30 Jul 2019, 5:46 pm
ట్రిపుల్ తలాక్ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. బిల్లులోని కొన్ని అంశాలను తాము వ్యతిరేకిస్తున్నామని.. ట్రిపుల్‌ తలాక్‌ సివిల్‌ కాంట్రాక్ట్‌ కిందకు వచ్చే అంశమని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు క్రిమినల్‌ పనిష్మంట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చట్టంలో లేని అంశాల ఆధారంగా కఠిన శిక్ష ఎలా విధిస్తారన్నారు.
Samayam Telugu visa


ట్రిపుల్ తలాక్‌ను తీవ్ర నేరంగా పరిగణించడం సరికాదన్నారు విజయసాయి. ఈ బిల్లుతో అమాయకులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని.. ఈ కేసుతో భర్తను జైలుకు పంపితే భార్యకు భరణం ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. బిల్లుపై తమకు ఆరు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. తమ పార్టీ అధినేత జగన్ సూచనలు.. ఈ బిల్లులోని లోపాల వల్ల తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వైసీపీ లోక్‌సభలో కూడా ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
Read Also: రాజ్యసభకు చేరిన ట్రిపుల్ తలాక్ బిల్లు
కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టంది. అక్కడ చర్చ తర్వాత ఆమోదం పొంది.. రాజ్యసభకు చేరింది. మంగళవారం ఈ బిల్లును కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ సభలో ప్రవేశ పెట్టారు. ఇక్కడ కూడా విపక్షాలతో పాటూ మరికొన్ని పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.