యాప్నగరం

వైసీపీ ఎంపీకి కేంద్రంలో పదవి.. గోదావరి జిల్లాల రైతులకు కీలకం

వైసీపీ ఎంపీకి కేంద్రంలో మరో కీలక పదవి.. కోకోనట్ బోర్డు సభ్యురాలిగా అమలాపురం ఎంపీ చింతా అనురాధ. ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి రైతులకు ఉపయోగపడే పదవి దక్కించుకున్న ఎంపీ.

Samayam Telugu 31 Jul 2019, 7:31 pm
వైసీపీకి చెందిన మరో ఎంపీకి కేంద్రంలో మరో పదవి దక్కింది. అమలాపురం ఎంపీ చింతా అనురాధకు కోకనట్ బోర్డులో సభ్యురాలిగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ సెక్రటేరియెట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ కోకోనట్‌ బోర్డు కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. దేశంలో కొబ్బరి ఉత్పత్తుల అభివృద్దికి, కొబ్బరి సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తుంది.
Samayam Telugu anuradha


అనురాధకు పదవి దక్కడం శుభపరిణామమనే చెప్పాలి. ఎందుకంటే ఆమె తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుంచి ఎంపీగా గెలిచారు. కొబ్బరి సాగు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది. అనురాధది కూడా అదే జిల్లా కావడంతో కొబ్బరి రైతుల సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు మంచి అవకాశం దొరికినట్లే. అలాగే కొబ్బరి ఉత్పత్తుల అభివృద్దికి కృషి చేయొచ్చు.

కేంద్రంలో మొత్తం నలుగురు వైసీపీ ఎంపీలకు పదవులు దక్కాయి. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ప్యానర్ స్పీకర్‌గా ఉండగా.. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎస్టిమేట్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇక రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళగిరి ఎయిమ్స్ సభ్యుడిగా ఉన్నారు. తాజాగా అమలాపురం ఎంపీ చింతా అనురాధ కోకోనట్ బోర్డ్ సభ్యురాలిగా నియమించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.