యాప్నగరం

తెలంగాణ ఎన్నికలకు దూరం.. వైసీపీ ప్రకటన

2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి వైసీపీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచారు. తర్వాత వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 11 Nov 2018, 9:31 am
డిసెంబరులో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ దృష్టంతా రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంచడం సరైనదని ఆ పార్టీ భావించింది. అందుకే తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం (నవంబరు 10) పత్రికా ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu YCP

గడచిన నాలుగన్నరేళ్లలో జరిగిన పరిణామాలకు పరిగణనలోకి తీసుకున్నాక, తెలంగాణలో పార్టీ పరిస్థితిని అంచనా వేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

అదేసమయంలో అయితే 2024 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించింది. 2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి వైసీపీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచారు. తర్వాత వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.