యాప్నగరం

తండ్రి స్పీకర్.. కొడుకు డిప్యూటీ స్పీకర్; వైఎస్ఆర్సీపీ నేత కోన అరుదైన ఘనత

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఎన్నిక లాంఛనమే. మంగళవారం ఆయన ఉప సభాపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన తండ్రి గతంలో స్పీకర్‌గా పని చేయడం గమనార్హం.

Samayam Telugu 17 Jun 2019, 9:51 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాపట్ల ఎంపీ కోన రఘుపతి నియామకం దాదాపు ఖరారైనట్టే. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేయగా.. కోన రఘుపతి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌ను బలపరుస్తూ 20 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. కోన రఘుపతి నియామకం ఏకగ్రీవం కానుంది. మంగళవారం ఉదయం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏపీ కేబినెట్లో చోటు దక్కకపోవడంతో... అదే వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.
Samayam Telugu kona rahupathi


గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కోన రఘుపతి.. 2014, 2019లో రెండు సార్లు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశేషం ఏంటంటే ఆయన తండ్రి కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్‌రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్‌గా పని చేశారు. 1981 ఫిబ్రవరి 24 నుంచి 1981 సెప్టెంబర్ 22 వరకు ఆయన ఏపీ స్పీకర్‌గా విధులు నిర్వర్తించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన.. ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. అనంతరం పుదుచ్చేరి, సిక్కిం, మహారాష్ట్రలకు గవర్నర్ కూడా పనిచేశారు.

ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఏపీల్లో గుంటూరు జిల్లా నుంచి స్పీకర్లుగా పనిచేసిన ఐదుగురిలో కోన ప్రభాకర రావు ఒకరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.