YS Jagan పేరుతో తప్పుడు ట్వీట్.. చర్యలకు సిద్ధమైన వైసీపీ
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి కేసీఆర్ గారికి సంబంధం లేదు. కావున కేసీఆర్ గారిని వైసీపీ కార్యకర్తలు ఏమీ అనొద్దు అని నా మనవి’అన్నది ట్వీట్ సారాంశం
Samayam Telugu 25 Apr 2019, 12:39 pm
ప్రధానాంశాలు:
- జగన్ పేరుతో సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్
- ట్వీట్పై స్పందించిన వైసీపీ నేతలు
- ఫేక్ ట్వీట్పై చర్యలకు సిద్ధమవుతున్నవైసీపీ
తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. అలాగే విద్యార్థుల ఆత్మహత్యలు కూడా కలకలంరేపుతున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీలతో పాటూ రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ అధినేత జగన్ పేరుతో ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంటర్ ఫలితాల విషయంలో ఫ్రభుత్వాన్ని, కేసీఆర్ను నిందిచొద్దంటూ జగన్ ట్వీట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ‘తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి కేసీఆర్ గారికి సంబంధం లేదు. కావున కేసీఆర్ గారిని వైసీపీ కార్యకర్తలు ఏమీ అనొద్దు అని నా మనవి’అన్నది ట్వీట్ సారాంశం. రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ ట్వీట్ హల్చల్ చేస్తోంది. ఈ ట్వీట్ వైసీపీ నేతల దృష్టికి వెళ్లడంతో స్పందించారు. ఈ ఫేక్ ట్వీట్పై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
ఇంటర్ ఫలితాలపై జగన్ చేసినట్టుగా ఉన్న ఆ ట్వీట్ ఫేక్ అని వైసీపీ స్పష్టం చేసింది. తప్పుడు ట్వీట్ను ప్రచారం చేస్తున్నారని.. ఈ ట్వీట్ వైరల్ చేసిన వారిని గుర్తించి.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు మీడియాకు తెలియజేసింది. దురుద్దేశంతోనే తప్పుడు ట్వీట్ను వైరల్ చేస్తున్నారని ఆరోపించారు.
ఇంటర్ ఫలితాలపై జగన్ చేసినట్టుగా ఉన్న ఆ ట్వీట్ ఫేక్ అని వైసీపీ స్పష్టం చేసింది. తప్పుడు ట్వీట్ను ప్రచారం చేస్తున్నారని.. ఈ ట్వీట్ వైరల్ చేసిన వారిని గుర్తించి.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు మీడియాకు తెలియజేసింది. దురుద్దేశంతోనే తప్పుడు ట్వీట్ను వైరల్ చేస్తున్నారని ఆరోపించారు.