వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ మాజీ ఎంపీలు, ముఖ్య నేతలతో కలిసి హైదరాబాద్ నుంచి బయల్దేరి సాయంత్రానికి హస్తినకు చేరుకున్నారు. జగన్ సోమవారం ఉదయం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలవబోతున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, అవకతవకలపై ఫిర్యాదు చేయనున్నారు. సోమవారం ఉదయం 11.30గంటలకు వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ను కలుస్తారు. ఓటర్ల జాబితాలో అక్రమాలతో పాటూ రాష్ట్ర డీజీపీ వ్యవహారశైలిపై సీఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ సానుభూతి పరుల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని వైసీపీ కొద్దిరోజులుగా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోని ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ నేతలు ఓసారి సీఈసీని కలిసి కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీకి వైఎస్ జగన్.. రేపు ఈసీతో కీలక భేటీ
ఢిల్లీ చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి.. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, అవకతవకలపై ఫిర్యాదు చేయనున్నారు.
Samayam Telugu 3 Feb 2019, 5:35 pm
ప్రధానాంశాలు:
- ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయంటున్న వైసీపీ
- అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫర్యాదు చేయనున్న జగన్
- సోమవారం ఉదయం సీఈసీని కలవబోతున్న వైసీపీ అధినేత