యాప్నగరం

‘టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేలను కొంటున్నారు’

తమ ఎమ్మెల్యేలకు డబ్బులు ఆఫర్ చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని

TNN 9 Feb 2018, 11:12 am
తమ ఎమ్మెల్యేలకు డబ్బులు ఆఫర్ చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కోరికి పాతిక కోట్ల రూపాయలను ఇస్తామని అంటూ.. ఫిరాయించమని తెలుగుదేశం ఒత్తిడి తెస్తోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. ఇప్పటికే ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను తెలుగుదేశం కొనుక్కొందని, వారిపై చర్యలు తీసుకొమ్మని స్పీకర్ ను కోరినా ప్రయోజనం లేకుండా ఉందని సాయి రెడ్డి ఫిర్యాదు చేశారు.
Samayam Telugu ysrcp complaints on defections to the president
‘టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేలను కొంటున్నారు’


ఈ ఫిరాయింపు- కొనుగోళ్ల వ్యవహారంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుండటం విశేషం. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చే బాధ్యతను ఆ ఎంపీ తీసుకున్నారని, ఆయన డబ్బులు ఇస్తూ.. ఫిరాయింపుల పర్వంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని వైసీపీ అంటోంది.

త్వరలోనే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. ఏపీ అసెంబ్లీ కోటా నుంచి వైసీపీకి దక్కే రాజ్యసభ సీటును దక్కకుండా చేయాలని తెలుగుదేశం ప్రయత్నాలు చేస్తోందని విజయసాయిరెడ్డి రాష్ట్ర పతికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరింత మంది ఎమ్మెల్యేలను కొని, వైసీపీకి దక్కే రాజ్యసభ సీటును కూడా దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కలిసి కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.