వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం అభివృద్ధి నిధులను కేటాయిస్తోందని మంత్రి లోకేష్ ట్వీట్ చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది. లోకేష్ బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆయన అజ్ఞానంతో ట్వీట్ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఏపీలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులను కేటాయిస్తున్నారు అనేది పూర్తిగా అబద్ధమని వైసీపీ అంటోంది.
చాలా నియోజకవర్గాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా, డెవలప్మెంట్ వర్క్స్ కోసం వారికి ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదని, న్యాయంగా వారి చేతికి అందాల్సిన నిధులను కూడా తెలుగుదేశం నేతలకు అందిస్తున్నారనేందుకు అనేక రుజువులు ఉన్నాయని వైఎస్సార్సీపీ నేతల అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జిల పేరుతో ఉన్న వారి చేతికి ప్రభుత్వ నిధులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
అందుకు సంబంధించి బోలెడన్ని జీవోలే రుజువులు అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేల హోదాలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా, అవే నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జిలుగా ఉన్న వారికి నిధుల బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వమే జీవోలు ఇచ్చిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ప్రజామోదం పొంది, గెలిచిన వారిని కాదని, ఎన్నికల్లో ఓడిపోయిన వారికి, తెలుగుదేశం నేతలుగా చలామణి అవుతున్న వారి పేరు మీద నిధుల కేటాయింపు చేసిన దుర్మార్గపు పాలన చంద్రబాబుది అని అంబటి ద్వజమెత్తారు.
నాలుగేళ్లుగా ఇదే జరుగుతోందని, తెలుగుదేశం పార్టీలోకి చేరితేనే అభివృద్ధికి నిధులిస్తామని పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి కూడా చేశారని అంబటి అన్నారు.
చాలా నియోజకవర్గాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా, డెవలప్మెంట్ వర్క్స్ కోసం వారికి ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదని, న్యాయంగా వారి చేతికి అందాల్సిన నిధులను కూడా తెలుగుదేశం నేతలకు అందిస్తున్నారనేందుకు అనేక రుజువులు ఉన్నాయని వైఎస్సార్సీపీ నేతల అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జిల పేరుతో ఉన్న వారి చేతికి ప్రభుత్వ నిధులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
అందుకు సంబంధించి బోలెడన్ని జీవోలే రుజువులు అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేల హోదాలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా, అవే నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జిలుగా ఉన్న వారికి నిధుల బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వమే జీవోలు ఇచ్చిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ప్రజామోదం పొంది, గెలిచిన వారిని కాదని, ఎన్నికల్లో ఓడిపోయిన వారికి, తెలుగుదేశం నేతలుగా చలామణి అవుతున్న వారి పేరు మీద నిధుల కేటాయింపు చేసిన దుర్మార్గపు పాలన చంద్రబాబుది అని అంబటి ద్వజమెత్తారు.
నాలుగేళ్లుగా ఇదే జరుగుతోందని, తెలుగుదేశం పార్టీలోకి చేరితేనే అభివృద్ధికి నిధులిస్తామని పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి కూడా చేశారని అంబటి అన్నారు.