ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మోసం చేస్తున్నాయని ప్రతిపక్ష వైకాపా పార్టీ ఆరోపిస్తుంది. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా మంగళవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇది ప్రజల కోసం, ప్రజల తరఫున తాము చేస్తున్న పోరాటంగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వర్తక మరియు వాణిజ్య సంఘాలు ఈ బంద్కు మద్ధతు ప్రకటించాయని ఆయన తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా కావాల్సిందే. హోదా సాధించే వరకు పోరాడతామని బొత్స స్పష్టంచేశారు.
రేపు ఆంధ్రప్రదేశ్ బంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మోసం చేస్తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా మంగళవారం ...
TNN 1 Aug 2016, 3:18 pm