యాప్నగరం

Chandrababu Naidu: నందమూరి కుటుంబం మళ్లీ మోసపోయింది-లక్ష్మీ పార్వతి

ఓడిపోతామని తెలిసే బాబు కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినికి టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టారు. మళ్లీ నందమూరి కుటుంబం మోసపోయింది.

Samayam Telugu 14 Dec 2018, 1:21 pm
చంద్రబాబు చేతిలో నందమూరి కుటుంబం మరోసారి మోసపోయిందన్నారు వైసీపీ నేత లక్ష్మీ పార్వతి. ఓడిపోతామని తెలిసే బాబు కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినికి టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో ప్రజల్ని కొనాలనుకున్నారని.. ఓటర్లు మాత్రం తిరస్కరించి.. దిమ్మ తిరిగేలా తీర్పు ఇచ్చారన్నారు. ఏపీ ప్రజలు కూడా చంద్రబాబును ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరాజయం తప్పదన్నారు. నెల్లూరులో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు, టీడీపీ సర్కార్ పాలనపై నిప్పులు చెరిగారు.
Samayam Telugu parvathi..


సోనియా గాంధీని ఇటలీ దెయ్యంగా వర్ణించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆమెను దేవతగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు లక్ష్మీ పార్వతి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీని చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో దోపిడీ పెరిగిపోయిందన్నారు లక్ష్మీ పార్వతి. రాజధాని, ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరుగుతోందని విమర్శించారు. ప్రతీ పథకంలోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఎమ్మెల్యేల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు.

ఏపీ సర్కార్ అవినీతి గురించి మాజీ సీఎస్ అజయ్ కల్లమ్ సంచలన విషయాలు బయటపెట్టారంటున్నారు లక్ష్మీ పార్వతి. కల్లమ్ చెప్పిన అవినీతి భాగోతం గురించి తెలిసి ప్రజలు షాక్ తింటున్నారన్నారు. రోజుకో టీడీపీ నేత అవినీతి బట్టబయలవుతోందని.. సీఎం రమేష్, సుజనా చౌదరిల భాగోతం ఈమధ్యే బయటకొచ్చిందన్నారు. త్వరలోనే లోకేష్ బాబు బండారం కూడా ప్రజల్లోకి రాబోతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.