యాప్నగరం

​నంద్యాల ఉప ఎన్నికలపై వైసీపీ నేత హాట్ కామెంట్స్!

భూమా మరణంతో ఉప ఎన్నిక ఏకగ్రీవం కావాలని తాము ఆశిస్తున్నామని

TNN 30 Mar 2017, 9:21 am
భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గంగుల ప్రతాప్ రెడ్డి. ఆ నియోజకవర్గం తమ పార్టీకే చెందుతుందని ఆయన అన్నారు. భూమా నాగిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఆయన తెలుగుదేశంలోకి ఫిరాయించి మరణించినా.. ఆ సీటు వైకాపాకే చెందుతుందని, భూమా మరణంతో ఉప ఎన్నిక ఏకగ్రీవం కావాలని తాము ఆశిస్తున్నామని, తాము నిలబెట్టే అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికకు తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందని అనుకుంటున్నామని ప్రతాప రెడ్డి అన్నారు.
Samayam Telugu ysrcp leader on nandhyal bypoll
​నంద్యాల ఉప ఎన్నికలపై వైసీపీ నేత హాట్ కామెంట్స్!


తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా మరణిస్తే.. ఆ నియోజకవర్గంలో ఏకగ్రీవ ఎన్నికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకరించిందని, ఇఫ్పుడు వైకాపా ఎమ్మెల్యే మరణంతో వస్తున్న ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టదని అనుకుంటున్నామని గంగుల అన్నారు. అలా కాదని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి ఎవరినైనా పోటీకి దించినా తాము ఉప ఎన్నికలకు సిద్ధమని వైకాపా నేత అన్నారు.

తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవానికి సహకరిస్తే ఫర్వాలేదు లేకపోతే అమితుమి తేల్చుకోవడానికి సిద్ధమని.. నంద్యాల నుంచి వైకాపా అభ్యర్థి కచ్చితంగా పోటీలో ఉంటాడని గంగుల స్పష్టం చేశారు.

మరి నంద్యాల ఉప ఎన్నిక విషయంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనేదనే అంశంపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. ఇక్కడ నుంచి భూమా చిన్న కూతురిని లేదా భూమా అన్న కొడుకును కానీ తెలుగుదేశం పార్టీ బరిలో దించే అవకాశాలున్నాయనే వార్తలు వచ్చాయి. ఇదే సమయం లో.. భూమా అఖిల ప్రియకు మంత్రి పదవిని ఇస్తే.. నంద్యాల నియోజకవర్గం టికెట్ ను వేరే ఎవరికైనా కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. వైకాపా మాత్రం నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీకి సై అంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.