యాప్నగరం

జగన్ ప్రమాణస్వీకారానికి కొద్ది గంటల ముందు.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సుబ్బాయమ్మ బుధవారం మరణించారు.

Samayam Telugu 29 May 2019, 9:10 pm
గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సుబ్బాయమ్మ (85) బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఎమ్మెల్యే తల్లి మరణించడంతో.. నరసరావుపేట వైఎస్ఆర్సీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Samayam Telugu gopireddy


2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వెంకట్రావుపై దాదాపు 16 వేల ఓట్ల తేడాతో శ్రీనివాస రెడ్డి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద బాబుపై ఆయన 32 వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.