యాప్నగరం

కేరళకు ఏపీ ఎమ్మెల్యే రూ.కోటి విరాళం!

కేరళ వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ అధినేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి.

Samayam Telugu 25 Aug 2018, 12:44 pm
కేరళ వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ అధినేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌతమ్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. తన సంస్థ తరఫు నుంచి, వ్యక్తిగతంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
Samayam Telugu Mekapati-Goutham-Reddy


కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ విరాళాన్ని జమ చేయనున్నట్టుగా వివరించారు. కేరళ సీఎం పినరాయి విజయన్‌ను కలిసి ఈ విరాళం చెక్‌ను అందించనున్నట్టుగా ఆయన వివరించారు. ఈ నెల 28,29 తేదీల్లో తను కేరళ వెళ్లి.. సీఎం అపాయింట్‌ను తీసుకుని విరాళం చెక్‌ను అందించనున్నట్టుగా తెలిపారు.

వరద బాధితుల పునరావాసం కోసం, ఇతర కార్యక్రమాల కోసం ఈ డబ్బును వినియోగించమని కోరనున్నామన్నారు. కేరళ వరదల బాధితుల కోసం ఏపీ ప్రముఖుల నుంచి వచ్చిన భారీ విరాళాల్లో ఇది ఒకటి. ఇది వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేరళ వరద బాధితుల కోసం కోటి రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అదే స్థాయి మొత్తాన్ని విరాళం ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.