యాప్నగరం

తాగుబోతులంతా కూర్చొని చేసిన బార్ల పాలసీ ఇది!

నారా వారి నరకాసుర పాలనలో ఆడ వారికి రక్షణే లేకుండా పోయిందని రోజా విమర్శించారు. ధనార్జనే లక్ష్యంగా మద్యం పాలసీ చేశారు..

TNN 24 Jun 2017, 6:02 pm
సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నారా వారి నరకాసుర పాలనలో ఆడ వారికి రక్షణే లేకుండా పోయిందని ఆమె విమర్శించారు. ‘ధనార్జనే లక్ష్యంగా మద్యం పాలసీ చేశారు. మద్యం విధానాల వల్ల ఆడవాళ్ల జీవితాలు బలవుతున్నాయి. మంచినీళ్లు ఇవ్వరు కానీ.. మద్యం ఇచ్చేస్తున్నారు. కొత్త మద్యం పాలసీతో ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో తెలుస్తోంది. చంద్రబాబు కంటే సిగ్గుమాలిన సీఎం ఎవరైనా ఉంటారా? తాగుబోతులంతా కూర్చొని చేసిన బార్ల పాలసీ ఇది. స్కూళ్లను మూసి బార్లను తెరవడం విజనా..? నారా చంద్రబాబు పేరును.. సారా చంద్రబార్‌ నాయుడిగా మార్చుకోండి’ అంటూ ఆమె ధ్వజమెత్తారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ఆర్‌‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె శనివారం (జూన్ 24) మీడియా సమావేశంలో మాట్లాడారు.
Samayam Telugu ysrcp mla roja fires on ap cm chandrababu naidu over liquor policy
తాగుబోతులంతా కూర్చొని చేసిన బార్ల పాలసీ ఇది!


రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని, బార్ల పాలసీ వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తప్పదని రోజా హెచ్చరించారు. మద్యం పాలసీ ద్వారా వచ్చిన దాంట్లో సీఎం చంద్రబాబు, లోకేశ్‌ వాటా ఎంత? అని ఆమె ప్రశ్నించారు. ‘జయంతికి, వర్థంతికి తేడా తెలియని లోకేశా... జగన్‌కు సవాల్ విసిరేది. సింహం ముందు పందికొక్కు తొడ కొట్టినట్లుంది’ అంటూ ఆమె యువ మంత్రి లోకేశ్‌పై విరుచుకుపడ్డారు.

లోకేశ్.. ముందు జాతీయ జెండాకు వందనం చేయడం నేర్చుకుంటే బావుంటుందని రోజా హితవు పలికారు. తనపై కొంతమంది అర్థంలేని వార్తలు రాస్తున్నారని, పనికిమాలిన టీడీపీలోకి, తలాతోకాలేని జనసేనలోకి వెళ్లనని ఆమె స్పష్టం చేశారు. ‘జగన్ ఎప్పుడూ నాకు అండగా ఉంటున్నారు. పార్టీలో మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. నా ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్‌ఆర్‌ సీపీలోనే ఉంటా’ అని రోజా తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.