యాప్నగరం

ధర్మ దీక్ష కాదు... దగా దీక్ష: రోజా

సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తిరుపతిలో ఆయన చేపడుతున్నది ధర్మ దీక్ష కాదు... దగా దీక్షని విమర్శించారు. హోదాపై నాలుగేళ్లుగా నోరు మెదపకుండా... ఇప్పుడు దీక్షల పేరుతో ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Samayam Telugu 29 Apr 2018, 2:19 pm
సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తిరుపతిలో ఆయన చేపడుతున్నది ధర్మ దీక్ష కాదు... దగా దీక్షని విమర్శించారు. హోదాపై నాలుగేళ్లుగా నోరు మెదపకుండా... ఇప్పుడు దీక్షల పేరుతో ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసం బాబు... రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెట్టారని... ఆయన్ను నమ్మక ద్రోహి అని ఎందుకు పిలవకూడదో చెప్పాలన్నాలని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా వైసీపీ హోదా ఉద్యమం చేస్తుంటే... దానిని కూడా ఉక్కుపాదంతో అణిచివేయాలని చూశారని మండిపడ్డారు.
Samayam Telugu Roja


నియోజకవర్గాల పెంపు కోసం హోదాను చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని... నాలుగేళ్లు ఏన్డీఏలో కొనసాగిన కేంద్రమంత్రులు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు రోజా. ధర్మ పోరాట దీక్షతో రూ.30కోట్లు ఖర్చు చేసిన బాబు... తిరుపతిలో కూడా మళ్లీ దీక్ష పేరుతో ప్రజల్ని ఫూల్స్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి దీక్షలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మబోరని... ఇకనైనా చిత్తశుద్ధితో హోదా కోసం పోరాడాలన్నారు రోజా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.