యాప్నగరం

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన జగన్

ఆళ్ల నాని, గంగుల ప్రభాకర రెడ్డిలను తమ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

TNN 2 Mar 2017, 3:49 pm
శాసనమండలి ఎన్నికల పరిణామాలు క్రమంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే గ్రాడ్యుయేట్స్, టీచర్స్, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించేయగా.. తాజాగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుల కోటాలో జరిగే శాసనమండలి సభ్యుల ఎన్నికకు అభ్యర్థులను ప్రకటించింది. శాసనసభలో బలాన్ని బట్టి చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు దక్కే అవకాశం ఉంది.
Samayam Telugu ysrcp mlc candidates
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన జగన్


ఈ మేరకు వైకాపా అధినేత జగన్ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కు చెందిన ఆళ్ల నాని, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన గంగుల ప్రభాకర రెడ్డిలను తమ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆళ్ల నాని గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు, గంగుల ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడి వైకాపా తీర్థం పుచ్చుకున్నాడు.

అయితే శాసనసభ్యుల కోటాలో రెండో అభ్యర్థిని గెలిపించుకోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సామే. దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ గనుక అదనపు అభ్యర్థిని పోటీలో నిలిపితే.. ఫిరాయింపుదారుల ఓట్లు కీలకం అవుతాయి. అయితే వారి ని కట్టడి చేయడానికి జగన్ పార్టీ విప్ ను జారీ చేసే అవకాశం ఉంది. విప్ ను ధిక్కరించి ఫిరాయింపుదారులు ఓటేస్తే.. వారిపై అనర్హత వేటు పడే అవకాశాలుంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.