యాప్నగరం

హోదా కోసం వైసీపీ ఎంపీ ప్రైవేట్ బిల్లు

ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

TNN 5 Feb 2018, 3:57 pm
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు రాజ్యసభ ప్రవేశానికి రాష్ట్రపతి ఆమోదముద్రపడటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ బిల్లు త్వరలోనే రాజ్యసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. బిల్లుపై ఓటింగ్ కూడా జరిగే అవకాశాలుంటాయి.
Samayam Telugu ysrcp mp moves private bill seeking spl status for ap
హోదా కోసం వైసీపీ ఎంపీ ప్రైవేట్ బిల్లు


అయితే రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో ఇది వరకూ ప్రైవేట్ బిల్లు ఒకటి ఇది వరకే రాజ్యసభకు వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అప్పట్లో ఈ బిల్లును పెట్టారు. దానిపై చర్చ జరిగింది కానీ, ఓటింగ్ జరగలేదు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే వరకూ వెనుకడుగు వేసేది లేదని, హోదా రాష్ట్రానికి సంజీవని అని విజయసాయి రెడ్డి అన్నారు. మరి ఈ ప్రైవేట్ బిల్లు ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందో వేచి చూడాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.