యాప్నగరం

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పంతం

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. తాను మోదీని, కేంద్రమంత్రుల్ని కలిసిన మాట వాస్తవమేనని... సీఎంను బోనులోకి ఎక్కించే వరకు వారిని కలుస్తూనే ఉంటానన్నారు.

Samayam Telugu 21 Mar 2018, 4:52 pm
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. తాను మోదీని, కేంద్రమంత్రుల్ని కలిసిన మాట వాస్తవమేనని... సీఎంను బోనులోకి ఎక్కించే వరకు వారిని కలుస్తూనే ఉంటానన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు టీడీపీకి లేదని... కేంద్రం నాలుగేళ్లలో ఇచ్చిన రూ. లక్షా 25వేల కోట్లు ఏమాయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు కోరిక మేరకే పోలవరం ప్రాజెక్ట్ బాధ్యతను రాష్ట్రానికి అప్పగించారని... రాజ్యసభలో తాను వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
Samayam Telugu Vijaya Sai Reddy


ప్రధానిని ఇష్టం వచ్చినన్ని సార్లు కలుస్తానని... దీనిపై టీడీపీకి అభ్యంతరమేంటని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని... దీనికి చంద్రబాబే కారణమన్నారు. ఆయనపై చర్యలు తీసుకొనే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. అప్పటి వరకు చేసేదంతా చేస్తానని తేల్చి చెప్పారు. ప్రధాని, కేంద్రమంత్రుల్ని విజసాయిరెడ్డి కలవడంపై టీడీపీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసింది. దీనిపై ఎప్పటికప్పుడు ఆయన కూడా కౌంటర్లు ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.