యాప్నగరం

మోదీని కలిశా.. తప్పేంటి: వైసీపీ ఎంపీ విజయసాయి

మోదీని కలవడంపై వస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఓ ఎంపీ హోదాలో ప్రధానిని కలవడంలో ఏం తప్పుందో తనకు అర్థం కావడం లేదని మీడియాతో చిట్‌చాట్‌గా చెప్పారట.

Samayam Telugu 19 Mar 2018, 4:31 pm
మోదీని కలవడంపై వస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఓ ఎంపీ హోదాలో ప్రధానిని కలవడంలో ఏం తప్పుందో తనకు అర్థం కావడం లేదని మీడియాతో చిట్‌చాట్‌గా చెప్పారట. ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించేందుకు ప్రధానిని కలిశానన్నారట. దీనిపై అనవసరరాద్థాంతం చేస్తున్నారని మండిపడ్డారట. ప్రధానితో భేటీలో ఏపీలో జరుగుతున్న అవినీతి గురించి కూడా ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారట. చంద్రబాబు అవినీతి డబ్బును హవాలా రూపంలో దేశం దాటిస్తున్న అంశాన్ని మోదీకి వివరించారట.
Samayam Telugu ysrcp mp vijaya sai reddy responds on his meet with modi
మోదీని కలిశా.. తప్పేంటి: వైసీపీ ఎంపీ విజయసాయి


ఇటీవల విజయసాయి ప్రధానిని కలిసినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనిపై టీడీపీ కూడా టార్గెట్ చేసింది. వైసీపీతో పొత్తు పెట్టుకునేందుకే విజయసాయి మోదీని కలిశారంటూ విమర్శలు కూడా చేశారు. ఈ ఆరోపణలపైనే విజయసాయి స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.