యాప్నగరం

Chandrababu Naidu ధైర్యానికి నా జోహార్లు: విజయసాయి

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ట్విట్టర్‌లో టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే.. ఆయనకు జోహార్లు చెబుతున్నానంటూ సెటైర్లు.

Samayam Telugu 3 Jul 2019, 2:09 pm
ఏపీలో విత్తనాల కొరతపై వైసీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విత్తనాల కొరతకు గత ప్రభుత్వ విధానాలే కారణమని వైసీపీ చెబుతుంటే.. తమపై బురద జల్లేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇలా నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు ఘాటుగా విమర్శలు చేసుకునే పరిస్థితి వరకు వెళ్లింది. తాజాగా విత్తనాల కొరతపై చంద్రబాబును టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. బాబుపై సంచలన ఆరోపణలు చేశారు.
Samayam Telugu chandrababu


ట్విట్టర్‌లో స్పందించిన విజయసాయిరెడ్డి ‘విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే.. ఆ నిధుల్ని ఓటర్ల ప్రలోభాలకు మళ్లించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి 30 వేల కోట్లు మాయ పేలాలు చేశారు. ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు బాబూ’అంటూ ఎద్దేవా చేశారు.
‘ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను గాలికొదిలి తన సౌకర్యాల గురించి పోరాడుతున్నారు చంద్రబాబు. ప్రభుత్వానికి రాసిన మొదటి లేఖలో ప్రజావేదికను కేటాయించాలని కోరారు. తనకు భద్రత పెంచాలని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. వేతనం తీసకుంటున్నందుకైనా ప్రజలను కాస్త గుర్తు పెట్టుకోండి బాబూ’అంటూ హైకోర్టులో బాబు భద్రతపై దాఖలైన పిటిషన్‌పైనా స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.