యాప్నగరం

ఏపీలో దోచుకుని తెలంగాణలో పంచుతున్నారు: విజయసాయి

కుల, మత, ప్రాంతాల పేరిట ఓట్లను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి ప్రజాస్వామ్యా్న్ని ఎలా ఖూనీ చేయాలో రాహుల్‌కు చంద్రబాబు ఉపదేశం చేశారని ఎద్దేవా చేశారు.

Samayam Telugu 2 Dec 2018, 4:52 pm
అబద్దాలు చెప్పడంతో ఆరితేరిన చంద్రబాబు జిమ్మిక్కులు చూసి రాహుల్‌గాంధీకి దిమ్మతిరిగిపోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ట్విటర్ సాక్షిగా ఏపీ సీఎంపై ఆయన విరుచుకుపడ్డారు. కుల, మత, ప్రాంతాల పేరిట ఓట్లను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి ప్రజాస్వామ్యా్న్ని ఎలా ఖూనీ చేయాలో రాహుల్‌కు చంద్రబాబు ఉపదేశం చేశారని ఎద్దేవా చేశారు.
Samayam Telugu vijayasaireddy


రాష్ట్రంలో కరవు విలయ తాండవం చేస్తోందని, లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు అల్లాడుతున్నారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చలేని చంద్రబాబు పక్క రాష్ట్రం వెళ్లి అది చేస్తా.. ఇది చేస్తా అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో దోచుకున్న సొమ్మును తెలంగాణ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు ఆయన అక్కడ మకాం వేశారని విజయసాయి ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.