యాప్నగరం

ysrcp: పచ్చచొక్కాలకు రెవెన్యూ కేంద్రాలుగా దేవాలయాలు: విజయసాయి రెడ్డి

చంద్రబాబు పాలనలో ఏపీలోని దేవాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

Samayam Telugu 10 Sep 2018, 7:02 pm
మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే దేవాలయాల జీర్ణోద్దరణ అన్నారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలు చంద్రబాబు హయాంలో నిరాధరణకు గురౌతున్నాయి అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
Samayam Telugu Vijayasai Reddy


ఏపీలో దశాబ్దాలుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్న దేవాలయ వ్యవస్థనే మెరుగుపరచడానికి నడుం బిగించారు ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దేవాలయాలలో నిత్య ధూపదీత, నైవేద్యాల కైంకర్యం నిరాఘాటంగా కొనసాగేందుకుకు ప్రత్యేకంగా నిధులు విడుదలతో పాటు, ఆదాయం లేని దేవాలయాలలో అర్చకులను ఆదుకున్నారు.

కాని దురదృష్టవశాత్తు చంద్రబాబు హయాంలో దేవాలయాలు పచ్చచొక్కాలకు రెవెన్యూ కేంద్రాలుగా మారాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిస్థితులను చక్కదిద్ది తిరిగి దేవాలయాలకు పూర్వ వైభవం కల్పించడం తధ్యం’ అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు విజయసాయి రెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.