యాప్నగరం

బాబు గొప్పలకు తలలు పట్టుకున్న సైంటిస్టులు: విజయసాయిరెడ్డి సెటైర్లు

ఉప్రగ్రహాల పరీక్ష విజయవంతం కావడాన్ని సైతం చంద్రబాబు రాజకీయం చేయడంపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Samayam Telugu 17 Nov 2018, 10:40 pm
జీశాట్-29 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించినట్లు తెలిసిందని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నందున తనను విస్మరించి నేరుగా ఇస్రో శాస్త్రవేత్తలను మెచ్చుకోవడం అయ్యారని తెలిసిందన్నారు.
Samayam Telugu Vijayasai Reddy


‘శ్రీహరికోట సతీష్ ధావన్ సెంటర్ ఏర్పాటు చేసింది తానేనని అక్కడ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 1971లోనే తాను అప్పటి ప్రధానికి లేఖ రాసినట్లు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న విషయాలను గమనించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఏపీ సీఎం చెప్పినవి నిజమోనేమో అంటూ తలలు పట్టుకుంటున్నారట.

కానీ 40 ఏళ్ల కిందటి రికార్డులు వారి వద్ద ఉండవన్న ధీమాతోనే చంద్రబాబు ఇలాంటి లేనిపోని గొప్పలు ప్రచారం చేసుకుంటున్నారని’ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. తనను కేంద్ర విస్మరిస్తున్నందున పాఠ్యాంశాల్లో తన పాఠాన్ని చేర్చి, విద్యార్థులకు చిన్ననాటి నుంచే తన గొప్పలు తెలిసేలా చేస్తే వాళ్లు పెద్దవాళ్లయి తనకు ఓటేస్తారని చంద్రబాబు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాగా, బేగంపేట విమానాశ్రయాన్ని తానే ఏర్పాటు చేశానని, రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాసిందని గతంలో పలుమార్లు గొప్పలకు పోయిన చంద్రబాబు అనంతరం తన వ్యాఖ్యలపై నాలుక్కరుచుకున్న విషయం తెలిసిందే. ప్రధాని పదవి ఆఫర్ చేస్తే సున్నితంగా తిరస్కరించానని, ఏపీ ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని పలుమార్లు వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.