యాప్నగరం

ఆయన రాష్ట్రానికి రాక ముందే.. ఈయన వెళ్లి కలిశారు

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీకి కాబోయే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. భువనేశ్వర్ వెళ్లిన ఆయన విశ్వభూషణ్‌తో కలిసి లింగరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

Samayam Telugu 20 Jul 2019, 4:53 pm
ఏపీ గవర్నర్‌గా ఒడిశా బీజేపీ నేత విశ్వభూషణ్ హరిచందన్‌ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. జూలై 23న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న విశ్వభూషణ్.. మరుసటి రోజు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన కోసం విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌ను రాజ్‌భవన్‌గా మార్చారు. గవర్నర్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నియమించింది.
Samayam Telugu visa at bhu


గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న విశ్వభూషణ్ హరిచందన్‌ను వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కలిశారు. భువనేశ్వర్ వెళ్లిన ఆయన.. విశ్వభూషణ్‌‌తో కలిసి లింగరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. గవర్నర్‌‌గా బాధ్యతలు చేపట్టనున్న విశ్వభూషణ్‌తో కలిసి ఫొటోలు దిగిన విజయసాయి.. భారతదేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించామని ట్వీట్ చేశారు.
విశ్వభూషణ్ ఏపీకి రాకముందే విజయసాయి భువనేశ్వర్ వెళ్లి ఆయన్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ, వైఎస్ఆర్సీపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడటంలో విజయసాయి కీలక పాత్ర పోషించారు. రాజ్యసభ సభ్యుడి హోదా ఢిల్లీలో బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకున్నారు. విజయసాయి పదే పదే ప్రధానిని, బీజేపీ ముఖ్య నేతలను కలవడం పట్ల ఎన్డీయే పక్షమైన టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరగడంలో విజయసాయి తనవంతు పాత్ర పోషించారు.

వైఎస్ఆర్సీపీలో నంబర్ 2గా కొనసాగుతున్న విజయసాయి.. గవర్నర్‌ బాధ్యతలు చేపట్టడానికి ముందే భువనేశ్వర్ వెళ్లి మరీ ఆయన్ను కలిసి రావడం ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.