యాప్నగరం

పరిటాల రవి హత్య తర్వాత చేసిన ఘనకార్యం మర్చిపోయావా బాబూ: విజయసాయి

పరిటాల రవి హత్య తర్వాత జిల్లాలకు ఫోన్ చేసి ఏం చెప్పారో మర్చిపోయారా చంద్రబాబు గారు. రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం మీది అంటూ సంచలన వ్యాఖ్యలు.

Samayam Telugu 28 Jul 2019, 2:21 pm
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పరిటాల రవి హత్య తర్వాత పరిణామాలతో పాటూ ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయడంపై బాబును టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదిక తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయం కోసం ఎంతకైనా దిగజారతంటూ మండిపడ్డారు.
Samayam Telugu ysrcp mp vijayasai reddy sensational comments on chandrababu naidu
పరిటాల రవి హత్య తర్వాత చేసిన ఘనకార్యం మర్చిపోయావా బాబూ: విజయసాయి


‘హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా చంద్రబాబు గారూ. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తర్వాత జిల్లాలకు ఫోన్లు చేసి ఎన్ని బస్సులు తగలబెట్టాలి. ఎవరెవరిపై దాడులు చేయాలో పార్టీ నాయకులకు టార్గెట్లు పెట్టిన చరిత్రను మర్చిపోయారా? రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం మీది’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాక, ఆయన విధించిన మద్యనిషేధాన్ని దేశమంతా అమలు చేయిస్తానని కోతలు కోశారు చంద్రబాబు. ఆ తర్వాత లిక్కర్ లాబీతో కుమ్మక్కై నిషేధం ఎత్తేశారు. జగన్ గారు దశల వారిగా నిషేధం పెడతానంటే మతి భ్రమించిన విమర్శలు చేస్తున్నారు’అంటూ ఘాటుగా విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.