యాప్నగరం

కొనసాగుతున్న వైసీపీ ఎంపీల నిరాహార దీక్ష

ప్రత్యేకహోదా డిమాండ్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది

Samayam Telugu 7 Apr 2018, 10:32 am
ప్రత్యేకహోదా డిమాండ్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది. హోదా కోసం తమ రాజీనామా పత్రాలను లోక్‌సభ స్పీకర్ కు ఇచ్చిన అనంతరం వీరు నిరాహార దీక్షను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీ భవన్ ఆవరణలో వీరి దీక్ష మొదలైంది. అయితే నిన్న సాయంత్రం ఢిల్లీలో విపరీతమైన ఈదురుగాలులతో వైఎస్సార్సీపీ ఎంపీల దీక్షా శిబిరం కూలిపోయింది. తీవ్రమైన గాలులతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరి దీక్ష ఏపీ భవన్ లోపలకు మారింది.
Samayam Telugu secondysrcp


ఏపీ భవన్ లోపల ఎంపీల నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది. ఈ విధంగా ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. దీక్షలో ఉన్న నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నిన్న రాత్రి అస్వస్థతకు లోనైనట్టుగా తెలుస్తోంది. ఆయన కడుపునొప్పితో బాధపడుతున్నట్టు సమాచారం. పరీక్షలు చేసిన వైద్యులు దీక్షను ఉపసహరించాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ 75యేళ్ల రాజమోహన్ రెడ్డి దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు.

ఎంపీల దీక్షకు సంఘీభావంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అక్కడకు చేరుకున్నారు. దాదాపు ఇరవై మందికిపైగా ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షకు హోదా సాధన సమితి నేతలు కూడా సంఘీభావం తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.