యాప్నగరం

లోక్‌సభ ముగిసిన మరుక్షణమే రాజీనామాలు!

‘‘ఏపీ ఎంపీలంతా కలిసి రాజీనామాలు చేస్తే 25 మంది రాజీనామాలు చేసినట్లవుతుంది. వీరికి మద్దుతుగా నిరసనలు జరిగితే.. కేంద్రం తప్పక దిగివస్తుంది’’ - జగన్

Samayam Telugu 1 Apr 2018, 12:40 am
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు తమ ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని, లోక్‌సభ సమావేశాలు ముగియగానే అంతా రాజీనామాలు చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పేరచర్లలో జరిగిన సభలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
Samayam Telugu app


ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ప్రభుత్వాలు మోసం చేశాయని జగన్ ఆరోపించారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగియగానే తమ పార్టీ ఎంపీలు స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పిస్తారన్నారు. అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్‌కు వెళ్ళి నిరాహార దీక్షకు దిగుతారని తెలిపారు. ఈ దీక్షకు విద్యార్థులు, యువతరం సంఘీభావం తెలపాలని కోరారు.

తమతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే.. మొత్తం 25 మంది రాజీనామాలు చేసినట్లవుతుందని తెలిపారు. వారికి మద్దుతుగా రాష్ట్రమంతా నిరసనలు జరిగితే కేంద్రం తప్పకుండా దిగివస్తుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.