యాప్నగరం

చంద్రబాబూ.. మీరు చేసిందేంటి? విజయమ్మ సూటి ప్రశ్న!

గుంటూరులో జరుగుతున్న వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశం రెండవ రోజులో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

TNN 9 Jul 2017, 12:42 pm
ఆంధ్రప్రదేశ్: గుంటూరులో జరుగుతున్న వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశంలో రెండవ రోజు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అబద్ధపు హామీలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ఈ మూడేళ్ల కాలంలో ప్రజలకు చేసిందేంటి అని అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌లో కాని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కాని ఏమాత్రం ముందడుగు పడలేదని అన్నారు. అధికారం చేపట్టిన నాటి నుండి ప్రభుత్వం తన కుటుంబంపైన, జగన్ పైన కుట్రపన్నుతున్నారని అయినా ప్రజా అభిమానం మాకు తోడుగా ఉందన్నారు.
Samayam Telugu ysrcp plenary second day live updates
చంద్రబాబూ.. మీరు చేసిందేంటి? విజయమ్మ సూటి ప్రశ్న!


35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే వారు జగన్‌ను కాదని రోశయ్యను ముఖ్యమంత్రిని చేశారని.. అయితే అప్పుడు తన తండ్రి సాధించి పెట్టిన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇష్టం లేక జగన్ రోశయ్యను సీఎంగా అంగీకరించారన్నారు. రాజశేఖర్ రెడ్డిగారి వల్ల కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే దాన్ని కాంగ్రెస్ తన కుటుంబంపై కఠినంగా వ్యవహరించిందన్నారు. అందువల్లే ప్రజల కోరిక మేర కాంగ్రెస్ పార్టీని వీడామన్నారు.

వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశాలను రాజధాని నగరంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని.. అయితే ఈ ప్లీనరీ సమావేశాల్లో ప్రతి ఒక్క వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్త రానున్న ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టే దిశగా కష్టపడాలన్నారు. జగన్ వేసే ప్రతి అడుగులోనూ తోడుగా ఉండాలని, నాయకుడు అనేవాడు ప్రజల మనసులు చదవాలని, వారి గుండె చప్పుడులో ఉండాలని తన బిడ్డ జగన్ ఇచ్చిన మాటను తప్పకుండా ప్రజలతో ఉన్నాడని ఆయన్ని ఆశీర్వదించాలని కోరారు విజయమ్మ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.