యాప్నగరం

వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అస్వస్థత

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు అస్వస్థత.. హుటా హుటిన ఆస్పత్రికి తరలింపు. కలెక్టరేట్‌ దగ్గర మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా సొమ్మసిల్లిన వైసీపీ సీనియర్ నేత.

Samayam Telugu 31 Jul 2019, 2:21 pm
వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు కలెక్టరేట్ దగ్గర ఎంపీఈవోల దీక్ష విరమణ సమయంలో ఆయన వాంతులు చేసుకొని సొమ్మసిల్లారు. వెంటనే ఆయన్ను దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు ఉమ్మారెడ్డికి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆస్పత్రికి వెళ్లారు.
Samayam Telugu umma reddy


బుధవారం ఉదయం గుంటూరు కలెక్టరేట్‌ దగ్గర ఎంపీఈవోల దీక్షల్ని విరమింపజేసేందుకు ఉమ్మారెడ్డి అక్కడికి వెళ్లారు. వారితో చర్చించి, సంఘీభావం తెలిపేందుకు అక్కడికి చేరుకున్నారు. ఎంపీఈవోలతో మాట్లాడి.. వారి సమస్యల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడుతున్న అస్వస్థతకు గురయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.