యాప్నగరం

అందుకే అమరావతికి రాజమౌళి దూరం!

రాజధాని పేరుతో అమరావతికి రోజుకో గ్రాఫిక్స్ చూపుతూ ఉన్నారని, అయితే ఈ విషయంలో చంద్రబాబు అవినీతి తీవ్రస్థాయిలో ఉందని..

Samayam Telugu 29 Mar 2018, 2:41 pm
రాజధాని పేరుతో అమరావతికి రోజుకో గ్రాఫిక్స్ చూపుతూ ఉన్నారని, అయితే ఈ విషయంలో చంద్రబాబు అవినీతి తీవ్రస్థాయిలో ఉందని.. అందుకే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా రాజధాని డిజైన్లకు దూరంగా ఉన్నారని అన్నారు వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారాయన. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పాలన సాగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Samayam Telugu tamineni


ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఆరువందల హామీలను ఇచ్చిందని అయితే వాటి అమలు విషయంలో చంద్రబాబు తీవ్రంగా విఫలం అయ్యారన్నారు. నాలుగేళ్ల టీడీపీ, బీజేపీ పాలనతో సర్వవ్యవస్థలూ నాశనం అయ్యాయన్నారు.

గవర్నర్, స్పీకర్, కలెక్టర్.. ఇలా అన్ని వ్యవస్థలనూ తెలుగుదేశం ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వారు ఫిరాయించింది స్పీకర్ కు తెలియదా? తెలియనట్టుగా నటిస్తున్నారా? అని తమ్మినేని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ అధికార పార్టీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ఎలా ప్రమాణ స్వీకారం చేయించారు? అని వైసీపీ నేత ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరించిందన్నారు.

మాటెత్తితే అందరూ ఆర్థిక నేరస్తులు అని చంద్రబాబు అంటారని.. అయితే ఓటుకు నోటు కేసుతో సహా చంద్రబాబుపై ఉన్న ఇతర అభియోగాల మాటేమిటి? అని తమ్మినేని ప్రశ్నించారు. ఆ కేసుల్లో విచారణను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ఆయన వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.