యాప్నగరం

జమిలి ఎన్నికలకు వైసీపీ మద్దతు

జమిలి ఎన్నికలకు వైసీపీ జైకొట్టింది. ఢిల్లీలో జాతీయ లా కమిషన్ ఛైర్మన్‌కు ఎంపీ విజసాయిరెడ్డి, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ తరపున లేఖ అందజేశారు.

Samayam Telugu 10 Jul 2018, 5:09 pm
జమిలి ఎన్నికలకు వైసీపీ జైకొట్టింది. ఢిల్లీలో జాతీయ లా కమిషన్ ఛైర్మన్‌కు ఎంపీ విజసాయిరెడ్డి, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ తరపున లేఖ అందజేశారు. ఆ లేఖలో జమిలి ఎన్నికలు వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రస్తావించారు. లా కమిషన్ ఛైర్మన్‌ను కలిశాక విజయసాయిరెడ్డి మాట్లాడారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు, అవినీతి తగ్గుతుందని.. అలాగే సవాళ్లు కూడా ఎదురవుతాయని వాటిని అధిగమించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ హంగ్ వస్తే పరిస్థితి ఏంటనే అనుమానాన్ని కమిషన్‌ ముందు ప్రస్తావించామని.. ప్రభుత్వం కూలిపోతే తర్వాత కాలానికి ఎన్నికలు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
Samayam Telugu ysrcp


విజయసాయి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థికి మద్దతు అంశంపై కూడా మాట్లాడారు. ఈ పదవికి బీజేపీ అభ్యర్థిని నిలబెడితే మద్దతిచ్చేది లేదని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొద్ది రోజులుగా జమిలి ఎన్నికలపై లా కమిషన్ అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను తొమ్మిది పార్టీలు వ్యతిరేకించగా.. వైసీపీతో కలిపి ఐదు పార్టీలు మద్దతు పలికాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.