యాప్నగరం

నంద్యాల్లో గొడవ, వైసీపీ నేతపై దాడి

చివరి వరకూ ప్రశాంతంగానే అనిపించిన నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ లో.. ఆఖరి గంటలో ఒక గొడవ చోటు చేసుకుంది.

TNN 23 Aug 2017, 6:13 pm
చివరి వరకూ ప్రశాంతంగానే అనిపించిన నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ లో.. ఆఖరి గంటలో ఒక గొడవ చోటు చేసుకుంది. ఏడో వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీకి గతంలో నంద్యాల ఇన్ చార్జిగా పని చేసిన మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనతో పాటు..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొందరు గాయపడ్డారు. గాంధీనగర్ బూత్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu ysrcptdp mutual attack in nandyal
నంద్యాల్లో గొడవ, వైసీపీ నేతపై దాడి


ఈ వివాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీనగర్ లో కొంతమంది దొంగ ఓట్లు వేస్తున్నారని బూత్ లో వైకాపా ఏజెంట్ అబ్జెక్షన్ తెలిపారు. దాదాపు ముప్పై మంది నాన్ లోకల్ వాళ్లు ఓట్లు వేస్తున్నారని.. వైకాపా ఏజెంట్ అభ్యంతరం తెలపడంతో, అబ్జర్వర్ పరిశీలించి.. వారిలో కొందరిని వెనక్కు పంపారు. అలా వెనక్కు వెళ్లిన వారిని.. పట్టణ టీడీపీ నేత ఫరూక్ తిరిగి తీసుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్లందరినీ ఒక వాహనంలో ఆయన అక్కడకు తీసుకురావడం జరిగిందని సమాచారం. ఇదే సమయంలో అక్కడకు వైకాపా నేతలు కూడా చేరుకున్నారు.

ఇరు వర్గాలూ ఎదురుపడటం.. ఆ ఓటర్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసుకోవడం.. చివరకు పరస్పరం బాహాబాహీకి దిగినట్టు సమాచారం. ఈ ఘటనలో మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వల్పంగా గాయపడగా, మరికొందరు వైకాపా కార్యకర్తలు తీవ్రంగా గాయపడినట్టుగా సమాచారం. ఈ అంశంపై ఈసీ, పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే వైకాపా నేతలే డబ్బులు ఇవ్వబోయారని తెలుగుదేశం వారు ప్రత్యారోపణ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.