జడ్పీ ఛైర్పర్సన్ ఆత్మహత్యాయత్నం శ్రీకాకుళంలో కలకలం సృష్టించింది. జడ్పీ ఛైర్పర్సన్ ధనలక్ష్మి వద్ద పీఏగా పనిచేస్తున్న సంతోష్ మంగళవారం (జనవరి 22) ఉదయం మీడియా ముందే బలవన్మరణానికి ప్రయత్నించాడు. జడ్పీ ఛైర్మన్ సమావేశం ఉందని మీడియాను పిలిచి.. వారి సమక్షంలోనే ఫినాయిల్ తాగారు. సహచర ఉద్యోగులు, మీడియా సిబ్బంది సంతోష్ను అడ్డుకొని ఫినాయిల్ బాటిల్ను లాక్కున్నారు. అనంతరం ఆయణ్ని ఆస్పత్రికి తరలించారు.
జిల్లా పరిషత్ సీఈవో నగేశ్తో పాటు మరో ఉద్యోగి తనను తీవ్రంగా హింసిస్తున్నారని సంతోష్ ఆరోపించారు. పదోన్నతి కల్పించే విషయంలోనూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఛైర్మన్కు అనుకూలంగా పనిచేస్తున్నావంటూ తనపై వేధింపుల పర్వం మొదలు పెట్టారని మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. తన కుటుంబసభ్యులు కూడా క్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడుతూనే సంతోష్ తన వెంట తెచ్చుకున్న ఫినాయిల్ బాటిల్ను ఒక్కసారిగా చేతిలోకి తీసుకొని తాగేశారు. మీడియా సిబ్బంది, సహచర ఉద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పలుమార్లు ఫినాయిల్ తాగేశారు. సంతోష్ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
జిల్లా పరిషత్ సీఈవో నగేశ్తో పాటు మరో ఉద్యోగి తనను తీవ్రంగా హింసిస్తున్నారని సంతోష్ ఆరోపించారు. పదోన్నతి కల్పించే విషయంలోనూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఛైర్మన్కు అనుకూలంగా పనిచేస్తున్నావంటూ తనపై వేధింపుల పర్వం మొదలు పెట్టారని మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. తన కుటుంబసభ్యులు కూడా క్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడుతూనే సంతోష్ తన వెంట తెచ్చుకున్న ఫినాయిల్ బాటిల్ను ఒక్కసారిగా చేతిలోకి తీసుకొని తాగేశారు. మీడియా సిబ్బంది, సహచర ఉద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పలుమార్లు ఫినాయిల్ తాగేశారు. సంతోష్ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.