ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నలుగుతున్న నీటి పంచాయతీకి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి పెద్దక్క పాత్ర పోషించారు. బుధవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులతో సమావేశమై సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేశారు. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ఉమాభారతి...నీటి కేటాయింపుల్లో ఎవరికీ ఏలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు, కేసీఆర్లు కూడా వితంతవాదం చేయకుండా...ట్రిబ్యునల్ తీర్పు మేరకు నీటిని వినియోగించుకుందామంటూ ఓ అవగాహనకు వచ్చారు.
వీరి సమావేశం సందర్భంగా ప్రధానంగా...మూడు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. అవి. 1. రెండు రాష్ట్రాల్లో పారుతున్న కృష్ణానదికి అనుసందానంగా నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగాన్ని తెలుసుకునేందుకు టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయడం..దీని ద్వారా కృష్ణా నది జలాలకు ఏ రాష్ట్రం ఎంతమేరకు వినియోగించుకుంటున్నది తెలుస్తుంది. 2. కృష్ణా నదిలో నీటి లభ్యతను అధ్యయనం చేసేందుకు కేంద్రంతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేయడం. 3. ఈ సంయుక్త కమిటీ ఇచ్చే నివేదికలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు సమర్పించి..నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోవడం. ఈ మూడు అంశాలపట్ల ఇరు రాష్ట్రాల సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే తెలంగాణ భారీనీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై గట్టిగా తన వాదనను వినిపించారు.
కాగా, రాష్ట్రవిభజన అనతరం ఇరు రాష్ట్రాల మధ్య నీటి వినియోగంపై సెక్షన్ 11లో పేర్కొన్న ప్రాజెక్టులో ఇవి లేవని కేంద్ర జలవనరుల కార్యదర్శి అమర్జిత్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేయగా..వాటిని చట్టంలో పేర్కొనాలని, చట్టంలో లేనంతమాత్రనా అవి కొత్త ప్రాజెక్టులు కాదని హరీష్ కేంద్రానికి స్పష్టం చేశారు. మరోవైపు కృష్ణా నది నుంచి తెలంగాణ 299 టీఎంసీల నీటిని వినియోగించుకుంటున్న నేపథ్యలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చాక ఎక్కువ తక్కువలు ఉన్నా కూర్చొని మాట్లాడుకుందామని చంద్రబాబు..కేసీఆర్కు సూచించారు. మహానది ప్రాజెక్టుల నిర్మాణంపై ఒడిషా, చత్తీస్ ఘడ్ల సీఎంలు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారని, తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ పాతమిత్రులే అయినందున నీటి వినియోగంపై జరిపిన చర్చకు సహకరించారని ఉమాభారతి అభినందించారు. ఇతరత్రా ప్రాజెక్టులపై మరోసారి చర్చించి అపెక్స్ వద్దకు రావాలని ఉమభారతి ఇద్దరు సీఎంలకు సూచించారు.
Union minister Uma Bharati convened a meeting with AP and Telanagana chief ministers, Chandrababu Nadi and K Chandra Sekhar Rao on the distribution of Krishna water. To set a telemetry machines on the both sides of AP and TS on Krishna waters usage KCR and CBN agreed amicably.
వీరి సమావేశం సందర్భంగా ప్రధానంగా...మూడు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. అవి. 1. రెండు రాష్ట్రాల్లో పారుతున్న కృష్ణానదికి అనుసందానంగా నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగాన్ని తెలుసుకునేందుకు టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయడం..దీని ద్వారా కృష్ణా నది జలాలకు ఏ రాష్ట్రం ఎంతమేరకు వినియోగించుకుంటున్నది తెలుస్తుంది. 2. కృష్ణా నదిలో నీటి లభ్యతను అధ్యయనం చేసేందుకు కేంద్రంతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేయడం. 3. ఈ సంయుక్త కమిటీ ఇచ్చే నివేదికలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు సమర్పించి..నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోవడం. ఈ మూడు అంశాలపట్ల ఇరు రాష్ట్రాల సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే తెలంగాణ భారీనీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై గట్టిగా తన వాదనను వినిపించారు.
కాగా, రాష్ట్రవిభజన అనతరం ఇరు రాష్ట్రాల మధ్య నీటి వినియోగంపై సెక్షన్ 11లో పేర్కొన్న ప్రాజెక్టులో ఇవి లేవని కేంద్ర జలవనరుల కార్యదర్శి అమర్జిత్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేయగా..వాటిని చట్టంలో పేర్కొనాలని, చట్టంలో లేనంతమాత్రనా అవి కొత్త ప్రాజెక్టులు కాదని హరీష్ కేంద్రానికి స్పష్టం చేశారు. మరోవైపు కృష్ణా నది నుంచి తెలంగాణ 299 టీఎంసీల నీటిని వినియోగించుకుంటున్న నేపథ్యలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చాక ఎక్కువ తక్కువలు ఉన్నా కూర్చొని మాట్లాడుకుందామని చంద్రబాబు..కేసీఆర్కు సూచించారు. మహానది ప్రాజెక్టుల నిర్మాణంపై ఒడిషా, చత్తీస్ ఘడ్ల సీఎంలు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారని, తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ పాతమిత్రులే అయినందున నీటి వినియోగంపై జరిపిన చర్చకు సహకరించారని ఉమాభారతి అభినందించారు. ఇతరత్రా ప్రాజెక్టులపై మరోసారి చర్చించి అపెక్స్ వద్దకు రావాలని ఉమభారతి ఇద్దరు సీఎంలకు సూచించారు.
Union minister Uma Bharati convened a meeting with AP and Telanagana chief ministers, Chandrababu Nadi and K Chandra Sekhar Rao on the distribution of Krishna water. To set a telemetry machines on the both sides of AP and TS on Krishna waters usage KCR and CBN agreed amicably.