యాప్నగరం

చుండ్రు సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటించండి

చాలామందిని వేధించే చుండ్రు సమస్య నుంచి బయటపడాలని అనుకుంటున్నారా? అయితే, ఈ చిట్కాలు పాటించండి.

Samayam Telugu 13 Jul 2020, 9:52 pm
ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య.. చుండ్రు. దీన్ని వదలగొట్టుకొనేందుకు వాడని షాంపూ లేదు.. చేయని ప్రయత్నమంటూ ఏదీ ఉండదు. ఈ చుండ్రు వల్ల కళ్ల దురదలు కూడ వేధిస్తాయి. చండ్రు ఎక్కువైతే.. క్రమేనా చర్మ సమస్యలు కూడా వస్తాయి. తలపై చుండ్రు ఎక్కువైతే స్థైర్యం దెబ్బతింటుంది. చికాకు పెరుగుతుంది. బయటకు వెళ్లాలంటేనే భయం కలుగుతుంది. నలుగురితో కలిసి తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. చుండ్రు కొందరిలో ఏకాగ్రత దెబ్బతీస్తుంది. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఖరీదైన మందులు, రసాయనాలు కొనాల్సిన అవసరం లేదు. ఈ కింది చిట్కాలు పాటిస్తే చాలు.
Samayam Telugu చుండ్రు సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటించండి


ఏం చేయాలి?:
చిట్కా 1: రాత్రి మెంతుల్ని నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే రుబ్బండి. అనంతరం ఆ మిశ్రమాన్ని తలకు పట్టించండి. ఓ గంటసేపు ఆగి షాంపూతో తలంటుకోండి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమే కాకుండా మాడు కూడా చల్లబడుతుంది.

Also Read: మహిళ గొంతులో ఏలిక పాము.. షాకైన వైద్యులు, ఎలా చేరిందంటే..

చిట్కా 2: వేప నూనె, ఆలివ్ ఆయిల్‌ను సమాన మోతాదులో కలిపి వేడి చేయండి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఆ మిశ్రమాన్ని వెంటుకలకు, మాడుకు రాసుకోండి. పావుగంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోండి.

Also Read: నటిని చంపి, రెండు ముక్కలుగా నరికి.. హిస్టరీని వణికించిన మిస్టరీ హత్య, హంతకుడు ఎవరంటే..

చిట్కా 3: చిన్న అల్లం ముక్కను సన్నని ముక్కలుగా తరిగి నువ్వల నూనెలో వేయండి. ఆ నూనెతో తలకు మర్దనా చేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు తలకు రాసుకొని ఉదయానే షాంపూతో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుంది.

చిట్కా 4:
కలబంద గుజ్జును మాడుకు పట్టించి పావుగంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోండి. వారానికి మూడు సార్లు ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా వెంటుకలు మృదువుగా మారతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.