యాప్నగరం

Natural Scrub : చందనంలో ఇవి కలిపి రాస్తే ముఖంపై అన్‌వాంటెడ్ హెయిర్ తగ్గుతుందట..

Natural Scrub : పప్పులు.. మన ఆహారంలో ముఖ్యమైన భాగం. దీనిని తినడం వల్ల ప్రోటీన్ అందుతుంది. అయితే, కేవలం ఆరోగ్యానికే కాదు. అందాన్ని కూడా ఇస్తుంది. అదెలానో చూద్దాం.

Produced byరావుల అమల | Samayam Telugu 30 May 2023, 2:25 pm
మైసూర్ పప్పు, ఎర్ర కందిపప్పు. చూడ్డానికి కందిపప్పులానే ఉన్నప్పటికీ ఇది కాస్తా ఆరేంజ్ కలర్‌లో ఉంటుంది. దీనిని ఎంతో రుచిగా వండుకోవచ్చు. అయితే, దీనిని చర్మానికి కూడా అప్లై చేయొచ్చు అని చెబుతున్నారు నిపుణులు. దీనిని ఫేస్ ప్యాక్‌లా చేసి వాడితే చర్మం మెరుస్తుందని చెబుతున్నారు.
Samayam Telugu masoor dal face scrubs you can try
Natural Scrub : చందనంలో ఇవి కలిపి రాస్తే ముఖంపై అన్‌వాంటెడ్ హెయిర్ తగ్గుతుందట..


​స్క్రబ్..

ఈ మైసూర్‌ని పప్పుని స్క్రబ్‌లా వాడొచ్చు. దీనిని వాడడం వల్ల రంధ్రాలు కూడా తగ్గుతాయి. దీంతో స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై ట్యాన్ తగ్గి బ్రైట్‌గా మారుతుంది. ఎలా వాడాలి. దీనికోసం ఏమేం కావాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఇంట్లోనే స్క్రబ్ తయారు చేయడం ఎలా..

పచ్చిపాలు ఎర్రకందిపప్పుతో..

పచ్చిపాలు
ఎర్ర కందిపప్పు

తయారీ విధానం..

ముందుగా పచ్చిపాలలో ఎర్రకందిపప్పు వేసి నానబెట్టాలి. దీనిని మెత్తగా పేస్ట్‌లా చేయండి. ఇలా తయారైన పేస్ట్‌ని ముఖాన్ని క్లీన్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కొద్దిగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి.
Also Read : ఆరెంజ్‌‌‌తో వీటిని కలిపి ముఖంపై రుద్దితే నల్లమచ్చలు మాయం..

బాదం నూనె, పాలు..

అదే విధంగా పాలు, బాదం నూనెలని కొద్దికొద్దిగా పప్పు పొడిలో కలపాలి. దీనిని ప్యాక్‌లా చేసి ముఖానికి అప్లై చేసి ఆరాక క్లీన్ చేయండి.

బెనిఫిట్స్..

బాదం నూనె, మైసూపర్ పప్పు రెండు కూడా ముఖంపై టాన్‌ని దూరం చేసి స్కిన్ బ్రైట్‌గా అయ్యేలా చేస్తుంది. దీనిని అప్లై చేయడం వల్ల ఈవెన్ స్కిన్ మీ సొంతమవుతుంది.
Also Read : గ్రీన్ టీతో ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయట..

మైసూర్ పప్పు, కొబ్బరినూనెతో..

ఈ రెండింటి కలయిక కూడా చర్మాన్ని బాగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. కొబ్బరి నూనె మీ చర్మాన్ని తేమగా చేస్తుంది.

ఎలా చేయాలంటే..

పప్పుని మెత్తగా మిక్సీ పట్టి.. అందులో కొద్దిగా పాలు, కొబ్బరినూనె వేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత స్క్రబ్‌లా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి.

చందనంతో..

పప్పు పొడిలో చందనాన్ని కలిపి రాయడం వల్ల ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. దీనిని వాడడం వల్ల ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి.

ఏం చేయాలంటే..

పప్పుని మెత్తగా గ్రైండ్ చేసి అందులో చందనం, నారింజ తొక్కల పొడి వేసి ముఖానికి అప్లై చేసి గుండ్రంగా రుద్దుతూ మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని క్లీన్ చేయాలి.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​Read More : Beauty News and Telugu News

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.