మనదేశంలో మొత్తం జనాభాలో 70శాతం మంది మాంసాహారులేనట. అలా అని వెజ్ డైట్ను వదిలేస్తున్నారని కాదు... దానికి కూడా ఎక్కువ విలువే ఇస్తున్నారు. రెండేళ్ల క్రితం ఓ సంస్థ చేసిన సర్వే తాలుకు విశేషాలివి. ఆ సర్వే నివేదికను రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సంస్థ విడుదల చేసింది. పూర్తిగా శాఖాహారులుగా ఉన్న వారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది. కాకపోతే మాంసాహారులు చికెన్, మటన్, చేపలతో పాటూ పప్పు ధాన్యాలు, ఆకుకూరలు కూడా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సర్వేల్లో వెజిటేరియన్లతో పోలిస్తే... నాన్ వెజిటేరియన్లే ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్టు తేలింది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు మాంసాహారులతో పోలిస్తే శాఖాహారుల్లో చాలా తక్కువగా కనిపిస్తాయి. మాంసాహారులు తినేదానిలో ఎక్కువగా ప్రాసెస్ట్ ఫుడ్ ఉండడం వల్లే వారికి అనారోగ్యాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉన్నట్టు సర్వే చెబుతోంది. చికెన్, ఫిష్, రొయ్యల్లాంటివి రెడీ టు ఈట్ పేరుతో ప్యాక్ చేసి అమ్మడం ఇప్పుడు ఎక్కువైంది. అవి ప్రాసెస్ట్ ఫుడ్ కిందకే వస్తాయి. కాగా గతంతో పోలిస్తే మనదేశంలో చికెన్ వాడకం చాలా ఎక్కువగా పెరిగింది. చికెన్ వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. మొన్నటికి మొన్న కేంద్ర మంత్ర జెపీ నడ్డా శాఖాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలంటూ పార్లమెంటులో వ్యాఖ్యానించారు.
దేశంలో డబ్బై శాతం మంది మాంసాహారులే
మనదేశంలో మొత్తం జనాభాలో 70శాతం మంది మాంసాహారులేనట.
TNN 9 Jun 2016, 11:08 am