యాప్నగరం

Eating Tips: ఆహారం ఇలా తింటే.. ఏ ఆరోగ్య సమస్యలు రావు..!

మనం తీసుకునే ఆహారం ఒక్క శరీరం మీదే కాదు.. మెదడు, మనసు మీదా ప్రభావం చూపుతాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టాలి. మనం ఏమి తింటున్నామనేదే కాదు.. ఎలా తింటున్నాం అనేది కూడా ముఖ్యమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే.. కొన్ని ఆహార విధానాలను ఆయుర్వేద నిపుణులు రూపొందించారు. ఆహార నియమాలను వివరిస్తూ , వేదామృత్ వ్యవస్థాపకులు, ఆయుర్వేద ఎండీ డా. వైశాలి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (Eating Tips)

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 16 Aug 2022, 4:21 pm
మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. సమతుల్య ఆహారం, పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. మన శరీరం తన విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి పోషకాహారం ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారం ఒక్క శరీరం మీదే కాదు.. మెదడు, మనసు మీదా ప్రభావం చూపుతాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టాలి. మనం ఏమి తింటున్నామనేదే కాదు.. ఎలా తింటున్నాం అనేది కూడా ముఖ్యమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే.. కొన్ని ఆహార విధానాలను ఆయుర్వేద నిపుణులు రూపొందించారు. ఆయుర్వేదం సిఫార్సు చేసిన విధంగా భోజనం తీసుకుంటే.. ఆహారం ఔషదంలా మారుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. (Eating Tips)
Samayam Telugu ayurveda doctor shared eating rules for good health
Eating Tips: ఆహారం ఇలా తింటే.. ఏ ఆరోగ్య సమస్యలు రావు..!

ఆహార నియమాలను వివరిస్తూ , వేదామృత్ వ్యవస్థాపకులు, ఆయుర్వేద ఎండీ డా. వైశాలి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆయుర్వేదం సిఫార్సు చేసిన ఈ నియమాలు పాటిస్తే.. ఆరోగ్య సమస్యలు రావని డా. వైశాలి అన్నారు. దీర్ఘకాలం పూర్తి ఆరోగ్యంతో జీవించవచ్చని అంటున్నారు.
View this post on Instagram A post shared by Dr Dixa Bhavsar Savaliya (@drdixa_healingsouls)


70-30 రూల్‌ పాటించండి..
మీకు ఆకలి వేసినదానికంటే.. తక్కువగా తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని డా. వైశాలి అన్నారు. ఈ విధంగా తింటే.. జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. మీకున్న ఆకలికి 70 నుంచి 80 శాతం మాత్రమే తినండి. 70-30 రూల్‌ పాటిస్తే మీ జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. మీ కడుపు 70% నిండి ఉండాలి, 30% ఖాళీగా ఉండాలి.
లంచ్‌ హెవీగా తినండి..

మీరు మధ్యాహ్న భోజనం హెవీగా తీసుకోవచ్చు. మన జీర్ణాశయం, శరీరం సూర్యుని కదలికను అనుసరిస్తాయి. ఈ సమయంలో మన శరీరానికి మరింత శక్తి అవసరం. మధ్యాహ్న భోజనం హెవీగా తీసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తోంది.
డిన్నర్‌ లేట్‌ చేయవద్దు..

ఈ రోజుల్లో రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. కానీ ఇది అలవాటుగా మారితే.. ఆరోగ్యానికి మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మన శరీరం రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమవుతుంది. మన జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల మనం తీసుకునే క్యాలరీలు.. ఫ్యాట్‌గా స్టోర్‌ అవుతాయి. రాత్రి భోజనం త్వరగా తింటే మంచిది. నిద్రపోవడానికి 3 గంటల ముందు ఆహారం తీసుకోవాలి.
ఫ్రెష్‌ ఫుడ్‌ తినండి..


చల్లారిన ఆహారాన్ని వేడి చేసి తినడం మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో నిల్వ ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి. మీ ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం మానుకోండి. పగటిపూట వండిన ఆహారం రాత్రిపూట తిన్నా ఫర్వాలేదు, అయితే ఫ్రిజ్‌లో ఉంచి మళ్లీ వేడిచేసిన ఆహారం తీంటే.. మీ ఆరోగ్యం పాడవుతుంది.
జీర్ణం పూర్తైన తర్వాతే..

మీరు అజీర్తి సమస్యతో బాధపడుతుంటే.. ఉపవాసం చేయడం మంచిది. మునుపటి భోజనం పూర్తిగా జీర్ణం కాకపోతే, ఇంకా ఆహారం తీసుకోవడం మానేసి.. శొంఠి కలిపిన వేడి నీళ్లు తాగితే మంచిది. మీ ఆహారం పూర్తిగా జీర్ణం అయిన తర్వాతే తినండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.