ఏడాది అంతటా అందుబాటులో ఉండే చౌక పండ్లలో అరటి ముఖ్యమైంది. రోజూ ఈ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయనే సంగతి తెలిసిందే. ఆహారంగా తీసుకోవడమే గాకుండా తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడాన్ని కూడా అరికట్టవచ్చు. ఇందులోని పోషకాలు కేశ సంరక్షణకు ఉపకరిస్తాయి. అరటిలో పోటాషియం అధిక మోతాదులో ఉంటుంది. ఫలితంగా అరటి పండు తిన్న వెంటనే శరీరానికి శక్తి అందుతుంది.
అరటిలోని విటమిన్లు, ఖనిజాలు జుట్టు రాలడాన్ని అరికడతాయి. అరటి సహజ హెయిర్ కండీషనర్లా పని చేస్తుంది. వెంట్రుకలు డ్యామేజీ కావడాన్ని నివారించడంతోపాటు మృదువుగా మారడానికి అరటి ఉపయోగపడుతుంది.
అరటి పండును, కొబ్బరి పాలను ఓ గిన్నెలోకి తీసుకొని బాగా కలపాలి. తర్వాత దాన్ని తలకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఉసిరి రసాన్ని కూడా ఈ గుజ్జుకు కలపొచ్చు.
సన్ఫ్లవర్ ఆయిల్, నిమ్మరసం, అరటి గుజ్జును కలిపి తలకు పట్టించడం వల్ల కేశాలు బలంగా మారతాయి. ఇందుకోసం అరటి పండును నలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుదుళ్లకు పట్టేలా.. తలకు రాసుకోవాలి. 20 నిమిషాలు ఆగాక గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
చాలా మందిలో చుండ్రు కారణంగా జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఇలాంటి వారు అరటి పండు పేస్టును అర కప్పు పెరుగుతో కలిపి తలకు రాసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
మాడు పొడిబారడం వల్ల కూడా వెంట్రుకలు రాలతాయి. అలాంటప్పుడు అరటి గుజ్జులో ఆలివ్ ఆయిల్ లేదా ఇంట్లో పట్టించిన కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకోవాలి. 15 నిమిషాలు ఆగిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. నెలకు రెండుసార్ల చొప్పున ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
అరటిలోని విటమిన్లు, ఖనిజాలు జుట్టు రాలడాన్ని అరికడతాయి. అరటి సహజ హెయిర్ కండీషనర్లా పని చేస్తుంది. వెంట్రుకలు డ్యామేజీ కావడాన్ని నివారించడంతోపాటు మృదువుగా మారడానికి అరటి ఉపయోగపడుతుంది.
అరటి పండును, కొబ్బరి పాలను ఓ గిన్నెలోకి తీసుకొని బాగా కలపాలి. తర్వాత దాన్ని తలకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఉసిరి రసాన్ని కూడా ఈ గుజ్జుకు కలపొచ్చు.
సన్ఫ్లవర్ ఆయిల్, నిమ్మరసం, అరటి గుజ్జును కలిపి తలకు పట్టించడం వల్ల కేశాలు బలంగా మారతాయి. ఇందుకోసం అరటి పండును నలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుదుళ్లకు పట్టేలా.. తలకు రాసుకోవాలి. 20 నిమిషాలు ఆగాక గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
చాలా మందిలో చుండ్రు కారణంగా జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఇలాంటి వారు అరటి పండు పేస్టును అర కప్పు పెరుగుతో కలిపి తలకు రాసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
మాడు పొడిబారడం వల్ల కూడా వెంట్రుకలు రాలతాయి. అలాంటప్పుడు అరటి గుజ్జులో ఆలివ్ ఆయిల్ లేదా ఇంట్లో పట్టించిన కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకోవాలి. 15 నిమిషాలు ఆగిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. నెలకు రెండుసార్ల చొప్పున ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.