యాప్నగరం

Mangoes : మామిడిపండ్లు షుగర్ పేషెంట్స్ తినొచ్చా..

ఎండాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడిపండ్లే కనిపిస్తాయి. పండ్ల రారాజు మామిడిని మనం తినకుండా ఉండలేం. అందుకే కచ్చితంగా అందరూ ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడిపండ్ల కోసం ఎదురుచూస్తారు. కానీ, కొంతమంది ఈ మామిడి పండ్లు తినకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని ఎవరు తినాలి.. ఎవరు తినకూడదు..అసలు ఈ పండ్లలో ఉండే విటమిన్స్ ఏంటి.. ఎంత పరిమాణంలో తినాలి.. ఏ సమయంలో తినాలి.. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి.

Authored byరావుల అమల | Samayam Telugu 20 May 2022, 11:15 pm
మామిడిపండు అంటే చాలు.. చాలా మంది నోరూరుతుంది. చాలా మంది సమ్మర్‌ని ఇష్టపడుతున్నాం కేవలం మామిడి పండ్ల కోసమే అంటూ చెబుతుంటారు. అందుకే ఈ సీజన్‌లో దొరికే ఆ పండును విరివిగా తింటారు. అయితే ఈ పండుని కొంతమంది తినకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల జిహ్వరుచి ఏమోగాని నష్టం ఉంటుందని అంటున్నారు.
Samayam Telugu can a diabetic patient eat mangoes know here all facts
Mangoes : మామిడిపండ్లు షుగర్ పేషెంట్స్ తినొచ్చా..



​మామిడి పండ్లలోని పోషకాలు..

అన్ని పండ్లలానే ఈ సీజనల్ ఫ్రూట్‌ కూడా ఎన్నో విటమిన్స్‌ని కలిగి ఉంటుంది ఇందులో చక్కెర శాతం 15 ఉండగా, ఒక శాతం మాంసకృత్తులు, తగిన మోతాదులో విటమిన్ ఏ, బి, సిలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేసేవే. కానీ, కొంతమందికి మాత్రం ఇవి మేలు కంటే ఎక్కువగా కీడే చేస్తాయని చెబుతున్నారు. అందుకే వీటిని ఎవరు తినాలి, ఎవరు తినకూడదు ఇలాంటి విషయాల్లో బాగానే చర్చ జరుగుతుంది. ఇందులో నిజనిజాలు ఏంటో తెలుసుకోండి..

Also Read : Heart Health : వీటిని తినడం మానేస్తే మన గుండెని కాపాడుకున్నట్లే..

​షుగర్ పేషెంట్స్..

చక్కెర శాతం అధికంగా ఉన్న ఈ పండు తినడం షుగర్ పేషెంట్స్‌కి మంచిది కాదని చెబుతున్నారు డా. శ్రీనివాస్, ఈయన హైదరాబాద్ కేర్ హాస్పిటల్‌లో ఎండోక్రినాలజీ విభాగంలో ఎమ్‌డిగా ఉన్నారు. ఇందులో అధికంగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందని, ఇది షుగర్ పేషెంట్స్‌కి మంచిది కాదని ఆయన అంటున్నారు. అయితే మరి అంతలా తినాలనిపిస్తే ఆహారానికి బదులు భోజనం సమయంలో అది కూడా అరుదుగా తినాలని చెబుతున్నారు డాక్టర్. అంటే మామిడిపండుని మోతాదులో తినొచ్చని ఆయన సూచిస్తున్నారు. మరి అతిగా తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని చెబుతున్నారు.

​పెరుగుతో కలిపి తినడం..

చాలా మందికి సమ్మర్ వచ్చిందంటే చాలు.. ఏ రకంగానైనా మామిడిపండుని తినడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే కొంతమంది పెరుగులో మామిడిపండుని కలిపి తింటారు. ఇది కూడా షుగర్ లేని వారు తినొచ్చు కాని ఉన్న వారు ఇలా తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని డా. శ్రీనివాస్ చెబుతున్నారు. ఇందులోని కేలరీస్ శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతాయని అంటున్నారు. ఇవి మాత్రమే కాదు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆయన అంటున్నారు.

Also Read : World Dance Day : డాన్స్ చేస్తే కార్డియో వాస్క్యులర్ సమస్యలు దూరమవుతాయా..

​మామిడి పండు ఏ సమయానికి..

కొంతమంది పండు ఉదయం సమయంలో తినాలి అంటారు. ఇదే విషయంపై డాక్టర్‌ని ప్రశ్నించగా.. అలాంటి ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు డా. శ్రీనివాస్. ఏ సమయంలో తిన్నా కూడా తగిన మోతాదులో తినాలని మోతాదుకి మించి తినడం ఎప్పటికి మంచిది కాదని ఆయన సూచిస్తున్నారు. మొత్తానికి మామిడి ప్రియులు ఈ విషయాలు తెలుసుకుని మీరు ఈ జాగ్రత్తలు తీసుకుని పండుని, ఆ రుచిని ఎంజాయ్ చేయండి. ఆహారమే ఔషధం.. అది పరిమితంగా తిన్నప్పుడు మాత్రమే.. పరిమితి దాటితే విషమని మరవొద్దు.

Also Read : Health : ఎక్కువ కాలం ఒంటరిగా ఉంటే ఆ సమస్యలు తప్పవట

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.